నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన మంత్రుల కమిటీ, ఏప్రిల్ 17న, మరో సమావేశం
ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్: ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకొంది.
రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఆదివారం నాడు హైద్రాబాద్ లో రాజ్ భవన్ లో సమావేశమైంది.విభజన సమస్యలపై ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులు గవర్నర్ సమక్షంలో చర్చించారు.
ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చించింది.అయితే ఈ విషయమై ఏ నిర్ణయానికి రాలేదు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే సచివాలయం, అసెంబ్లీ భవనాల అప్పగింతపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా ఎపి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
ఎపి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు ఆదివారం నాడు. అయితే ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు హజరు కావడంతో గవర్నర్ నరసింహన్ అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా మంత్రులు చెప్పారు.