ఆరెస్సెస్ దాని కోసమే పని చేస్తుంది: కమ్యూనిస్టులపై వెంకయ్య ఆగ్రహం
కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు కమ్యూనిస్టుల పైన సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు కమ్యూనిస్టుల పైన సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమ్యూనిస్టులు సమాజంలో అంతరాలు పెంచేందుకు పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆరెస్సెస్ మాత్రం దేశహితం కోసం పని చేస్తోందన్నారు.
ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) పైన విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. అసలు ఇప్పుడు జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలలో కమ్యూనిస్టుల ఉనికే లేదని ధ్వజమెత్తారు. వారు అంతరాలు పెంచేందుకు పని చేస్తున్నారన్నారు.
దానికేం సంబంధం, నేనే పోరాడుతా: పవన్ కళ్యాణ్కు చంద్రబాబు షాక్
జల్లికట్టుపై..
తమిళనాడు ప్రజలు సంయమనం పాటించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు గందరగోళం చేస్తున్నాయన్నారు. జల్లికట్టు విషయంలో ప్రధాని మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తెస్తున్నాయన్నారు. రాజకీయం చేసే ప్రయత్నం సరికాదన్నారు. డీఎంకే, కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. ఉగ్రవాదం, బ్లాక్ మనీకి వ్యతిరేకంగా మోడీ పోరాడుతున్నారన్నారు.