వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను చంపేసి, ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య, గ్రామస్తులు చూడటంతో పరార్

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. చిన్నచింతకుంట మండలం, పర్దిపూర్‌లో ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టింది. గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో విషయం వెలుగు చూసింది.

గ్రామస్తులు గుర్తించడంతో ఆమె పరారయింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

Wife kills husbad in Mahaboobnagar district

బైకుల దొంగల అరెస్టు

మహబూబ్ నగర్ జిల్లా ఆమనల్లు సమీపంలో శ్రీశైలం, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆదివారం నలుగురు ద్విచక్రవాహనాల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.10 లక్షల విలువైన 20 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు యువకులు బైకుల పైన అనుమానస్పదంగా వెళుతున్నారు. యువకులను ఆపి విచారించగా, పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించగా.. వంగూరు మండలం సిర్సనగండ్లకు చెందిన నాగరాజు, అదే గ్రామానికి చెందిన హనుమంతు, రవి, వెల్దండ మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన హరితేజ అని, కొంతకాలంగా బైకులను దొంగిలిస్తున్నామని వివచారణలో అంగీకరించారు.

English summary
Wife kills husbad in Mahaboobnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X