నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి, రేప్ చేసి బాకీ తీరిందన్నాడు
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన వద్ద అప్పు చేసిన వివాహిత పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి అమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కుటుంబం ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్ డి.పోచంపల్లిలోని శ్రీరామ్నగర్కాలనీలో నివాసం ఉంటోంది. దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం.
తమిళనాడుకు చెందిన కత్రివేళు(30) గాజులరామరంలో నివాసం ఉంటూ వాయిదాల పద్ధతిలో ఇంటి సామాన్లు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వీక్లీ ఫైనాన్స్ కూడా నడుపుతుంటాడు. అతనివద్ద బాధిత కుటుంబం సామాన్లు కొనడంతో పలుమార్లు వారి ఇంటికి కత్రివేళు వచ్చేవాడు.
భర్తలేని సమయంలో డబ్బు ఇవ్వాలని, గ్యారంటీ ఇప్పించమని భార్య(21)పై మంగళవారం రాత్రి ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత బైక్పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి..చేతులు కట్టేసి అత్యాచారం చేసి బాకీ తీరిందంటూ పారిపోయాడు.
నిజానికి, గండిమైసమ్మ చౌరస్తాలోని శ్రీరామ్నగర్ కాలనీలో చాలా మంది పేదవాళ్లే నివసిస్తుంటారు. అక్కడంతా నిరుపేద కుటుంబాలే. బాధిత మహిళ వడ్డీ వ్యాపారివద్ద రూ.10వేలు అప్పు తీసుకుంది. ఒప్పందం ప్రకారం అప్పు వాయిదాలు చెల్లిస్తూ వచ్చింది. రూ.4,500 అప్పు తీరింది. ఇటీవల నగరంలో కురిసిన భారీవర్షాల వల్ల భర్తకు పనులు లభించలేదు.
చేతిలో చిల్లిగవ్వ లేకపోవటంతో అప్పు వాయిదా కట్టడం కష్టమైంది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వడ్డీ వ్యాపారి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె తన వద్ద డబ్బు లేదని చెప్పినా వినలేదు. అప్పుతీర్చమంటూ గొడవ చేశాడు. వచ్చే వారం చెల్లిస్తానని చెప్పటంతో కొంత శాంతించాడు.
మధ్యవర్తిగా ఉన్న మహిళ ముందు ఒప్పుకోవాలని, ఆమె వద్దకు తీసుకెళ్తానని తన బైక్పై ఎక్కించుకునిస్టేడియం వద్ద గల పొదల్లోకి తీసుకెళ్లాడు. నిస్సహాయంగా ఉన్న మహిళ చేతులు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కట్లు విప్పి, నీ బాకీ తీరిపోయింది అంటూ పారిపోయాడు.
భర్త సహాయంతో మంగళవారం అర్ధరాత్రి బాధితురాలు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.