కెసిఆర్ ఆఫీస్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు క్యాంప్ కార్యాలయం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సష్టించింది.. శనివారం ఉదయం హైదరాబాదులోని నాచారం ప్రాంతానికి చెందిన నాగరాజు సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. దీన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని అడ్డుకుని పంజాగుట్ట పోలీస్స్టేషన్కు తరలించారు.
తాను కాప్రా డివిజన్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షడిగా ఉన్నానని, పదకొండు సంవత్సరాలుగా టీఆర్ఎస్లోనే ఉన్నానని పోలీసుల విచారణలో నాగరాజు తెలిపారు. కాప్రా డివిజన్లో సమస్యలపై గత కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ తనను లోనికి అనుమతించడం లేదనే అవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నాగరాజు తెలిపారు.
ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్కు మూడు మూగజీవాలు బలయ్యాయి. మూడు పశువులను విద్యుత్ తీగలు పొట్టన పెట్టుకున్నాయి. జిల్లాలోని బోథ్ మండలం కరత్వాడలో శనివారం ఈ హృదయవిదారక ఘటన జరిగింది.
ఓ రైతుకు చెందిన మూడు ఆవులను ఇంటి వద్ద కట్టేసి ఉంచగా... ఆ ప్రాంతలో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి... ఆవుల మీద పడ్డాయి. దీంతో మాటలు రాని ఆ జీవాలు జీవం కోల్పాయాయి. ఈ ఘటన స్థానికుల హృదయాల్ని కలచివేసింది.