ఛార్జింగ్ పెడితూ మృతి: విద్యార్థినితో ఉపాధ్యాయుడి రాసలీలలు, లాడ్జిలో అడ్డంగా బుక్
ఖమ్మం/మెదక్: మెదక్ జిల్లా రేగోడు మండలం నిరుజప్లలో విఠల్ అనే వ్యక్తి తన సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో నిరుజప్ల గ్రామంలో విషాదం అలుముకుంది.
మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలం తడాక్ తండా దగ్గర అడవుల్లో భార్యను చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
విద్యార్థినితో రాసలీలలు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పట్ల కీచకుడిగా మారాడు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలోని ఓ లాడ్జిలో పదో తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడు పట్టుబడ్డాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి ఉపాధ్యాయుడు విద్యార్థినితో కలిసి సూర్యాపేటకు వచ్చాడు.
అనంతరం ఓ లాడ్జికి విద్యార్థినిని తీసుకెళ్లాడు. ఈ విషయం పోలీసులకు చేరింది. లాడ్జిలో రంగప్రవేశం చేసిన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.