శేషు కుమార్ పితానికి ప్రవాసి ఎక్సలెన్సీ-2016 అవార్డు
తెలుగు అసోసియేషన్ అఫ్ జెద్దాహ్ లో బాగా మై చురుకైన సమాజ సేవకుడిగా అందరి మెప్పు పొందిన శ్రీ శేషు కుమార్ పితాని ప్రవాసి ఎక్సలెన్సీ అవార్డు-2016 కు ఎంపికయ్యారు.
జెద్దాహ్: కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్రమాసపత్రిక -టీఏజె ధన్య వాదాలు. సమాజం లోని సేవ భావనను గుర్తించి దాన్నిప్రోత్సహించడం అనేది ఒక గొప్ప విషయం.
సమాజ శ్రేయస్సు కోసం సంక్షేమ కార్య క్రమాలను నిర్వహిస్తూ. తోటి మానవులకు సేవచేస్తున్న సమాజ సేవకులను గుర్తించి వారికో గుర్తింపు ఇవ్వడం మరియు వారిని ప్రోత్చహించేవిధంగా సన్మానించడం నిజంగా ఒక గొప్ప కార్యం, అసలైన సమాజ సేవ కూడా.
తెలుగు అసోసియేషన్ అఫ్ జెద్దాహ్ లో బాగా మై చురుకైన సమాజ సేవకుడిగా అందరి మెప్పు పొందిన శ్రీ శేషు కుమార్ పితాని గారు ఈ అవార్డు కు ఎంపిక కావడం తమ సంఘ సభ్యులందరికి ఆనందంగా ఉందని సంఘ అధ్యక్షులు శ్రీ యూసఫ్ గారు అన్నారు,శ్రీ శేషు కుమార్ గారు , తెలుగు అసోసియేషన్ అఫ్ జెద్దాహ్ రాబిగ్ పట్టన విభాగానికి భాద్యులు గా సేవలను అందిస్తున్నారు .
గత ఎంతో కాలంగా తమ సమాజ సేవతో ఎంతో మందిని భాదితులను ఆదుకున్న శ్రీ శేషు కుమార్గారికి ఈ అరుదైన అవకాశం దక్కడం అనేది ఒక అదృష్టాంగా భావిస్తూ.సేవలను గుర్తించి అవార్డుద్వారా సన్మానిస్తున్న కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక తో పాటు వ్యవస్థాపకులు, శ్రీభీంరెడ్డి మంద గారికి ,అవార్డుల కమిటీ అధ్యక్షులు ప్రొ. అడపా సత్యనారాయణ గారి కి ధన్యవాదాలు తెలిపారు.
మున్ముందు కూడా ఇలాంటి సేవ ప్రోత్చహిత కార్య క్రమాల ద్వారా సమాజ సేవకులకుప్రోత్సాహించాలని ఆశ భావాన్ని వ్యక్త పరిచారు.