నైజీరియాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ వాసి మృతి
లాగోస్: నైజీరియాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మెదక్ జిల్లా వాసి మృతి చెందాడు. జిల్లాలోని జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లికి చెందిన కుంట సాయిలు నైజీరియాలో ఉంటున్నాడు. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిలు మరణంతో ఎర్రవల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు కన్నీటిపర్యాంతమయ్యారు.
సౌదీ అరేబియాలో ప్రమాదం: ఐదుగురు మృతి
న్యూయార్క్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రైలర్ను వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన వారిలో కేరళకు చెందిన సంతోష్ కుమార్, ఇక్బాల్ నోమన్, తుల్సీ కృష్ణన్, రవీంద్ర నాయర్, శివకుమార్, భాగవతి పిళ్లైలు ఉన్నారని భారత రాయబార కార్యాలయం అధికారి మనోజ్ కుమార్ తెలిపారు.