'గడీల పాలన -తాకట్టులో తెలంగాణ': ఎన్నారై కాంగ్రెస్ పుస్తకావిష్కరణ..
రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అడ్డగోలు వ్యవహారాలపై 'గడీల పాలన -తాకట్టులో తెలంగాణ' పుస్తక ఆవిష్కరణ చేసారు .
లండన్: శుక్రవారం లండన్లో తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో టీపీసీసీ తయారుచేసిన పీపుల్స్ ఛార్జ్ షీట్ - పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.
తెరాస 3 ఏండ్ల రాచరిక పాలనలో ప్రజల అవస్థలు,తప్పిన ఎన్నికల వాగ్ధానాలు, నిరంకుశ ,అప్రజాస్వామిక ,ప్రజా వ్యతిరేక విధానాలపై, వివిధ రంగాల్లో అడ్డగోలు వ్యవహారాలపై తయారుచేసిన 'గడీల పాలన -తాకట్టులో తెలంగాణ' పుస్తక ఆవిష్కరణ చేసారు .
దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అమరుల బలిదానాల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణ రాచరిక పాలనను తలపిస్తుందని ,ఒంటెద్దు పోకడలు ఎన్ని రోజులు అని ప్రశ్నించారు. ఓట్లు సీట్లు ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రికి సూచించారు .
కార్యక్రమంలో అడ్వైజరీ మెంబర్లు డోకుర్ పవన్ కుమార్ ,ఓరుగంటి కమలాకర్ రావు, యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్ తదితరులు ప్రసంగించి ప్రభుత్వ పని తీరు పై ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు రంగుల సుధాకర్ గౌడ్ ,రామ్మోహన్ రెడ్డి ,రాకేష్ బిక్కుమండ్ల ,అచ్యుత రెడ్డి సభ్యులు ,సత్య ప్రకాష్ , రాజేశ్వేర్ రెడ్డి , దేవులపల్లి శ్రీనివాస్ ,మధు గట్ట ,తదితరుల ఆధ్వర్యం లో సుమారు 100 మంది పుస్తకావిష్కరణ కి మద్దతు తెలిపారు.