వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్‌లో విశాఖ యువకుడి మృతి, ఆందోళనలో తల్లితండ్రులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం నందగిరినగర్‌కు చెందిన చెరుకూరి సంతోష్ కుమార్ (26) మరణించాడు. జనవరి 22వ తేదీ సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకూరి నూకరాజు, నాగలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు సంతోష్‌కుమార్ పీజీ చదవడానికి 2012లో న్యూజిలాండ్ వెళ్లాడు.

చదువు పూర్తి అయిన తర్వాత నాలుగు నెలల క్రితం అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న కంపెనీ విధుల నిమిత్తం 22న న్యూజిలాండ్ సమీపంలోని టవరంగా అనే మరో ప్రాంతానికి వెళ్లాడు. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా కారును భారీ ట్రక్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

vizag youth dies in road accident at new zealand

సంతోష్ కుమార్ మరణవార్త అతని స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు చేరింది. రెండురోజుల్లో మృతదేహాన్ని విశాఖపట్నంకు పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు, అక్కడి తెలుగు సంఘం హామీ ఇచ్చింది. రెండు రోజులు పూర్తైన కూడా మృతదేహం ఇంటికి చేరకపోవడంతో సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీకెండ్ సెలవులు కారణంగా డెత్ సర్టిఫికేట్ రాలేదని, అక్కడున్న వారు చెబుతున్నట్టు మృతుని సోదరుడు రాజేంద్ర తెలిపారు. తమ కుమారుని మృతదేహం స్వస్థలం చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీస్‌కమిషనర్‌లను మృతుని తల్లితండ్రులు ఆదివారం కోరారు.

English summary
Visakhapatnam youth dies in road accident at new zealand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X