నా జేమ్స్బాండ్ అతడే, పాక్లో ఉన్నాడు: సానియా
హైదరాబాద్: తన జేమ్స్ బాండ్ తన భర్తే అని స్టార్ టెన్నిస్ తార సానియా మీర్జా శుక్రవారం చెప్పారు. బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 'నా జేమ్స్బాండ్ మా ఆయనే. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్లో ఉన్నాడ'ని షోయబ్ను ఉద్దేశించి చెప్పారు.
తనకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పిన విషయం తెలిసిందే. ఆటకు, నటకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. తన ప్రాధాన్యం ఎప్పుడు టెన్నిస్కేనని చెప్పారు.
జేమ్స్బాండ్ పాత్ర పోషించిన హీరోల్లో తనకు పియర్స్ బ్రాస్నన్ అంటే ఇష్టమని సానియా చెప్పారు. తన ఆత్మకథకు సంబంధించి.. ఇంకా రెండేళ్ల విషయాలు రాయాల్సి ఉందని చెప్పారు. అది త్వరలో బయటకు వస్తుందని, కానీ ఎప్పుడో చెప్పలేనని సానియా మీర్జా చెప్పారు. అంతకుముందు ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సానియా మీర్జా
భారత్ స్టార్ టెన్నిస్ తార సానియా మీర్జా శుక్రవారం నాడు మహారాష్ట్ర రాజధాని ముంబైలో రిలయన్స్కు చెందిన పేలెస్ స్టోర్ లాంచింగ్ సమయంలో..
సానియా మీర్జా
తన జేమ్స్ బాండ్ తన భర్తే అని స్టార్ టెన్నిస్ తార సానియా మీర్జా శుక్రవారం చెప్పారు. 'నా జేమ్స్బాండ్ మా ఆయనే. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్లో ఉన్నాడ'ని షోయబ్ను ఉద్దేశించి చెప్పారు. ముంబైలో ఓ కార్యక్రమంలో సానియా.
సానియా
తనకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, ఆటకు, నటకు చాలా తేడా ఉంటుందని, తన ప్రాధాన్యం ఎప్పుడు టెన్నిస్కేనని సానియా మీర్జా చెప్పారు.
సానియా మీర్జా
'నా జేమ్స్బాండ్ మా ఆయనే. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్లో ఉన్నాడ'ని షోయబ్ను ఉద్దేశించి టెన్నిస్ తార సానియా మీర్జా చెప్పారు.