రైతు బిడ్డ: ఒడికట్టి విత్తనమేసిన ఏపీ మంత్రి పరిటాల సునీత
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఉన్న పరిటాల సునీత పంటపొలాల్లో విత్తనాలు చల్లారు. ఆమె తన సొంత జిల్లా అనంతపురంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుంటారు. ఈ క్రమంలో పలుమార్లు పంట పొలాల్లో పని చేస్తూ కనిపించారు.
తాజాగా, గురువారం నాడు కూడా ఆమె పంట పొలాల్లో విత్తనాలు జల్లుతూ కనిపించారు. జిల్లాలోని రామినేనిపల్లిలో పర్యటించన ఆమె అక్కడి రైతులతో కలిసి పొలంలోకి అడుగు పెట్టారు.
పార్టీని వదిలి వ్యవసాయం చేసుకుంటున్న టిడిపి ఎంపీ, కారణం అదేనా?
అక్కడ వేరుశనగ విత్తనాలు వేస్తుండటాన్ని చూసిన సునీత వారికి జత కలిశారు. చీరను ఒడి కట్టి, వేరుశనగ గింజలు అందులో వేసుకొని విత్తనాలు చల్లారు. ఎద్దులతో రైతు దున్నుతుండగా.. వెనుకనే సాగులో విత్తనాలు జల్లుతూ వెళ్లారు.
కాగా, మన రాజకీయా నాయకులు చాలామంది సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు తమతమ వ్యవసాయ క్షేత్రాల్లో కనిపించడం సాధారణమే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిత్యం మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుంటారు.