హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్యలు చేపట్టండి: వైస్ ఆదేశం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: వర్షాభావ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన శనివారం పరిస్థితిని సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కునేందుకు వెంటనే రూ. 45.5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సమావేశానంతరం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు అందిస్తామని ఆయన చెప్పారు. కరువు పరిస్థితులను తట్టుకునేందుకు ప్రతి నెలా 600 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

కరవు పరిస్థితిని ప్రకటించే పరిస్థితులు ఇప్పుడు లేవని, రాష్ట్రంలోని 80 శాతం మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 35 లక్షల మందికి కూలీ దొరికే అవకాశం లేకుండా పోయిందని ముఖ్యమంత్రి అంటూ వారిని ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X