టాలీవుడ్లో స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీ అనేది చాలా సాధారణమైన విషయం. ఇద్దరు అగ్ర హీరోలు తమ భారీ చిత్రాలతో బరిలోకి దిగడం, రికార్డుల కోసం పోటీ పడటం మనం తరచూ చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఒక విచిత్రమైన పోరు జరిగింది. తిరుగులేని కమర్షియల్ మార్కెట్ ఉన్న మెగాస్టార్ చిరంజీవితో.. విప్లవాత్మక ప్రజా చిత్రాల నాయకుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పోటీ పడ్డారు. ఒకే రకమైన టైటిల్స్, ఒకే నేపథ్యంతో సాగిన ఈ పోరులో చివరికి ఊహించని ఫలితం దక్కింది. ఆ అరుదైన సినీ సమరానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను మనం తెలుసుకుందాం.
గురుశిష్యుల సవాల్!
రిక్షా కార్మికుల కష్టాలు, వారి జీవితాల్లోని కన్నీళ్లను నేపథ్యంగా తీసుకుని ఇద్దరు భిన్నమైన హీరోలు తలపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'రిక్షావోడు' సినిమా భారీ అంచనాలతో ప్రారంభమైంది. అయితే, ఈ సినిమా షూటింగ్ మొదలైన రెండు నెలలకే.. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో 'ఒరేయ్ రిక్షా' తెరకెక్కింది. దాసరి, కోడి రామకృష్ణలు గురుశిష్యులు కావడంతో, ఈ పోటీ కేవలం ఇద్దరు హీరోల మధ్యే కాకుండా.. ఇద్దరు దర్శకుల ప్రతిష్ఠాత్మక సవాల్గా కూడా మారింది.
చచ్చేవరకు సల్మాన్ నన్ను వదిలిపెట్టడు: బాలీవుడ్ను కుదిపేస్తున్న స్టార్ హీరోయిన్ కామెంట్స్!
అప్పట్లో టాలీవుడ్లో తిరుగులేని ఫామ్లో ఉన్న చిరంజీవి సినిమా 'రిక్షావోడు'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, సినిమా విడుదలయ్యాక ఫలితం మాత్రం పూర్తిగా తలకిందులైంది. భారీ బడ్జెట్, కమర్షియల్ హంగులతో వచ్చిన 'రిక్షావోడు' ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి మెగాస్టార్ను ఎంతగా కలిచివేసిందంటే.. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఆయన దాదాపు ఎనిమిది నెలల పాటు మేకప్ వేసుకోకుండా, సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. మరోవైపు, ఆర్. నారాయణమూర్తి 'సూర్యం' అనే రిక్షా కార్మికుడి పాత్రలో నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది. పక్కా ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ, వందేమాతరం శ్రీనివాస్ అద్భుతమైన సంగీతంలో గుండెలకు హత్తుకునే విప్లవాత్మక పాటలతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. గురువు దాసరి చేతిలో శిష్యుడు కోడి రామకృష్ణ పరాజయం పాలవగా, బాక్సాఫీస్ రేసులో నారాయణమూర్తి విజేతగా నిలిచారు. ఈ చిత్రం థియేటర్లలో ఏకంగా 175 రోజులు ఆడి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ బాక్సాఫీస్ పోరులో ఓటమిని చవిచూసినప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి దానిని ఎంతో హుందాగా స్వీకరించి తన సంస్కారాన్ని చాటుకున్నారు. 1996 మే 4న చెన్నైలో జరిగిన 'ఒరేయ్ రిక్షా' విజయోత్సవ సభకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ.. "మా రెండు రిక్షాల మధ్య జరిగిన పోటీలో.. నారాయణమూర్తి రిక్షానే ముందుకు దూసుకుపోయింది" అని నవ్వుతూ తన ఓటమిని అంగీకరిస్తూ ఆర్. నారాయణమూర్తిని మనస్ఫూర్తిగా అభినందించారు. మెగాస్టార్ చూపించిన ఈ క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డ మెగాస్టార్ చిత్రం
175 రోజుల రికార్డు!
ఏడేళ్ల వయస్సులో కన్న తండ్రే లైంగికంగా వేధించాడన్న స్టార్ బ్యూటీ..!
ఓటమిని ఒప్పుకుని.. హుందాగా నిలిచిన చిరంజీవి