60 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. బ్రిటిష్ కాలం నాటి లెజెండ్రీ బీర్ వచ్చేస్తుంది

స్వాతంత్ర్యానికి పూర్వం నాటి చారిత్రక జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, ప్రపంచ ప్రఖ్యాత బ్రూవరీ సంస్థ భారత్‌లోకి సుదీర్ఘ విరామం తర్వాత అడుగుపెట్టింది. సరిగ్గా ఆరు దశాబ్దాల కాలం తర్వాత ప్రముఖ బ్రిటీష్ బ్రూవర్ 'లయన్ బ్రూవరీ కంపెనీ' మన దేశ మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. తొలి విడతగా దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో తన ప్రీమియం బీర్ ఉత్పత్తులను లాంచ్ చేసి సరికొత్త సంచలనానికి తెరతీసింది.

Advertisement

భారత మార్కెట్లో తమ వ్యాపారాన్ని పటిష్టం చేసేందుకు 'లయన్ బ్రూవరీ' సంస్థ 'కాపర్‌డ్రాప్ స్పిరిట్స్'తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలో ఈ విదేశీ బ్రాండ్‌కు కాపర్‌డ్రాప్ స్పిరిట్స్ సంస్థే ఎక్స్‌క్లూజివ్ డీలర్ గా వ్యవహరించనుంది. తొలి దశలో ఢిల్లీలో లాంచ్ అయిన ఈ ఉత్పత్తులను, త్వరలోనే హర్యానా అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Advertisement

లండన్ నుంచి మన దేశానికి ఉన్న నాటి చారిత్రక బంధం

లండన్ నగరంలో 1836లో స్థాపించబడిన ఈ లయన్ బ్రూవరీ కంపెనీకి మన దేశంతో ఎంతో బలమైన చారిత్రక అనుబంధం ఉంది. బ్రిటిష్ కాలంలో మన దేశానికి ఎగుమతి చేసేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 'ఇండియా పెయిల్ ఐల్' శైలి బీర్లను మొట్టమొదటగా తయారు చేసి ఎగుమతి చేసిన ఘనత ఈ సంస్థదే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విల్ జూలియస్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, భారత్ తమకు కేవలం ఒక కొత్త మార్కెట్ మాత్రమే కాదని, తమ బ్రాండ్ చరిత్రలో ఒక భాగమని వెల్లడించారు.

Advertisement
Beer బాటిల్ లెక్క తేలింది. ఎవరి జేబులోకి ఎంత వెళ్తోంది?

భారత్‌లో భారీగా పెరుగుతున్న ప్రీమియం బీర్ల హవా

ప్రస్తుతం భారతీయ బీర్ మార్కెట్లో 'ప్రీమియం' రకాలకు వినియోగదారుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ఈ ప్రీమియం సెగ్మెంట్ ఏకంగా 40 శాతానికి పైగా వృద్ధి చెందుతుండటం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆదాయాలు, మైక్రోబ్రూవరీల విస్తరణే ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. IMARC గ్రూప్ అంచనాల ప్రకారం.. 2023లో భారత్‌లో మొత్తం బీర్ మార్కెట్ విలువ సుమారు 4.5 బిలియన్ డాలర్లుగా ఉండగా, మొత్తం మార్కెట్ వృద్ధి కంటే ప్రీమియం సెగ్మెంట్ ఏకంగా 42 నుంచి 45 శాతం మేర వేగంగా దూసుకుపోతోంది.

Advertisement
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. రెండు రోజులు వైన్స్ బంద్

మార్కెట్లోకి వచ్చిన తొలి ఫ్లేవర్లు ఇవే!

భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తూ లయన్ కంపెనీ తన తొలి అడుగుగా 'ఐలాండ్ లాగర్', 'పెయిల్ ఐల్' రకాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇవి ఢిల్లీ మార్కెట్లో 330 మి.లీ బాటిళ్ల రూపంలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వినియోగదారుల రుచికి తగ్గట్టుగా మరిన్ని కొత్త ప్యాకింగ్ ఫార్మాట్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.