దేశీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన పరపతి విధాన సమీక్షలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రధాన రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాంతో పాటు తన విధానపరమైన వైఖరిని 'తటస్థం'గానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది.
Advertisement
ధరల పెరుగుదల క్రమంగా అదుపులోకి రావడం, దేశీయంగా ఆర్థిక ప్రగతి వేగంగా ముందుకు సాగుతుండటంతో వడ్డీ రేట్లను పెంచాల్సిన లేదా తగ్గించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భావించింది. ఈ నిర్ణయంతో హోం లోన్, వెహికిల్ లోన్ తీసుకున్న వారిపై కొత్తగా ఎలాంటి ఈఎంఐ భారం పడకుండా ఉపశమనం లభించింది.
Advertisement