పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీక్ నిరోధక బిల్లులోని కీలకాంశాలు!

దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన విస్తృత నిరసనలు, రాజకీయా పరిణామాల నేపథ్యంలో పేపర్ లీకుల నిరోధక చట్టాన్ని సవరించడానికి సోమవారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీకులలో ప్రమేయం ఉన్నట్లు రుజువైన వ్యక్తులకు పదేళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించవచ్చు. జులై 20న పార్లమెంటు వరకు జరిగిన పాదయాత్ర సందర్భంగా నిరసనకారులపై జరిగిన అణచివేతలో చోటుచేసుకున్నట్లు ఆరోపించబడిన అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Advertisement
సారీ.. సర్: ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పిన సోషల్ మీడియా దిగ్గజం
Advertisement

ఈ సవరణ బిల్లు ప్రకారం..
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం, 2024ను పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026 సవరిస్తుంది. ఈ కొత్త చట్టం పేపర్ లీక్ కేసుల దర్యాప్తును పూర్తి చేయడానికి2 నెలల గడువును నిర్దేశిస్తుంది. పేపర్ లీకులతో సహా అక్రమ పద్ధతులకు పాల్పడిన వ్యక్తులకు విధించే శిక్షను, 2024 చట్టంలోని 3 నుంచి 5 ఏళ్ల నుంచి 5-10 ఏళ్లకు పెంచింది. గతంలో రూ. 10 లక్షలుగా ఉన్న జరిమానాను రూ. 50 లక్షలకు పెంచారు. నేరం వ్యవస్థీకృతంగా జరిగినట్లు తేలితే, కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. ఈ ముసాయిదా చట్టంలో ప్రశ్నపత్రాలను లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్లను తారుమారు చేయడం, నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించడం , నకిలీ అడ్మిట్ కార్డులను జారీ చేయడం వంటి 15 చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా పేర్కొన్నారు.

Advertisement

ఈ బిల్లు ప్రకారం ఛార్జిషీట్ దాఖలు చేసిన మూడు నెలల్లోపే విచారణను పూర్తి చేయగల ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారం కల్పించబడుతుంది. కొన్ని పేపర్ లీక్ కేసులను దర్యాప్తు చేయడానికి ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి అధికారం ఉంటుందని కూడా ఈ బిల్లులో పేర్కొనబడింది.

PM Modi: ప్రతీ ఆదివారం 8 గంటలకు మోడీ స్పీచ్..! తేల్చేసిన కేంద్రం..!

గందరగోళం మధ్య బిల్లు
ఢిల్లీ నిరసనలో నిరసనకారులపై జరిగిన అణచివేత సమయంలో చోటుచేసుకున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులను చర్చలో పాల్గొనాలని కోరారు. "ప్రభుత్వ పరీక్షల ప్రక్రియను మెరుగుపరిచే దిశగా ఇది మొదటి అడుగు. నినాదాలు చేయడం మాని, మీరు సభలో బిల్లుపై చర్చించాలి. మీరు సూచించిన అంశాలను చేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది" అని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ప్రతిపక్షాలు నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా నిరసనలు కొనసాగడంతో, కార్యకలాపాలను సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు.

Advertisement

జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల మొదటి వారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల మధ్య రద్దయింది. మంత్రి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ఇతర చోట్ల నిరసనకారులతో ప్రతిపక్షాలు కూడా గొంతు కలిపాయి. చివరకు శనివారం ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి వైదొలిగారు. నిరసనకారులపై అణచివేతలో పెల్లెట్ గన్‌ల వాడకం వంటి ఆరోపణల విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ప్రతిపక్షాలు ఇప్పుడు దృష్టి సారించాయి.

English Summary

Anti-Paper Leak Bill 2026 introduced in Lok Sabha. Strict punishments including up to 10 years jail and Rs 10 crore fine for exam paper leaks.