IMD: ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్! ఆకాశానికి తూట్లు.. ఈ జిల్లాల్లో వాన

దేశవ్యాప్తంగా వర్షాలు తీవ్ర రూపం దాల్చాయి. గుజరాత్, కేరళతో పాటు ఉత్తరాదిలోని కొండ ప్రాంతాల్లో కుండపోత వానలు విరుచుకుపడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, నిమిషాల్లో ప్రవాహ హోరుతో జనజీవనం స్తంభించిపోతోంది. రాబోయే గంటల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది.

Advertisement

గుజరాత్, కేరళలో రెడ్ అలర్ట్

వాతావరణ కేంద్రం తాజా సమాచారం ప్రకారం కేరళలోని ఆలప్పుజ, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, భావ్‌నగర్, కచ్‌ సహా దాదాపు 15 జిల్లాలకు అత్యవసర రెడ్ అలర్ట్ ప్రకటించారు. పౌరులు ఎవరూ అనవసరంగా బయటకు రాకూడదని, చెట్ల కింద లేదా పాడుబడిన భవనాల నీడన నిలబడవద్దని యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఇక మహారాష్ట్ర, అసోంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

Advertisement

ఉప్పొంగుతున్న నదులు.. ఊళ్లకు ఊళ్లే ఖాళీ!

గుజరాత్‌లోని నవసారి జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. కేవలం 14 గంటల వ్యవధిలోనే అక్కడ దాదాపు 7 అంగుళాల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పూర్ణ, కావేరి, అంబికా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో దాదాపు 9 వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. స్థానికంగా ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ సైన్యం రక్షణ చర్యల్లో పాల్గొంటోంది.

El Nino: చావు కబురు చల్లగా చెప్పిన ఐఎండీ- ఆగస్టులో వర్షాలపై తాజా అప్డేట్..!
Advertisement

సముద్రంలో ఆపరేషన్.. 17 మంది జాలర్ల రక్షణ

మరోవైపు అరబిక్ సముద్రంలో కేరళ తీరానికి సమీపంలో ఒక పడవ ఇంజిన్ చెడిపోవడంతో 17 మంది జాలర్లు నీటి అలల మధ్య చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న కోస్టల్ పోలీసులు, స్థానిక మత్స్యకారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అలాగే విశాఖపట్నం మరియు ముంబై తీరప్రాంతాల్లో సముద్రం తీవ్రంగా ఉన్నప్పటికీ, భారత నావికాదళం హెలికాప్టర్ల ద్వారా ప్రమాదంలో ఉన్న మత్స్యకారులను, ఓడ సిబ్బందిని కాపాడి తమ సాహసాన్ని చాటుకుంది.

ఎల్‌‌నినో వేళ తీపి కబురు, పెరగనున్న వర్షాలు - ఈ జిల్లాలపై ప్రభావం..!!
Advertisement

చార్ ధామ్ యాత్రకు అంతరాయం.. అసోంలో వరద మరణాలు

ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్ ధామ్ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గౌరీకుండ్ సమీపంలో పెద్ద ఎత్తున రాళ్లు, మట్టి రోడ్డుపై పడటంతో భక్తులను సురక్షిత ప్రాంతాలకు మళ్లించారు. ఆలాగే అలకనంద నది ఉప్పొంగుతుండటంతో రుద్రప్రయాగ్‌లో హైఅలర్ట్ విధించారు. ఇక అసోంలో వరదల ధాటికి మరణాల సంఖ్య 80కి చేరడం కలచివేస్తోంది. లక్షలాది మంది నిరాశ్రయులు కాగా, బాధితులను ఆదుకునేందుకు సహాయ నిధులు వెల్లువెత్తుతున్నాయి.

English Summary

IMD issues a red alert for Gujarat and Kerala amid continuous heavy rainfall and gusty winds. Rivers cross danger marks, landslides hit mountain routes, and thousands are relocated to safe zones