రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు.. కానీ అతడి హృదయం మాత్రం మరొకరికి పునర్జన్మ నిచ్చేందుకు సిద్ధంగా ఉంది. గమ్యస్థానానికి త్వరితగతిన చేర్చకపోతే ఆ గుండె పనిచేయదు. అలాంటి సమయంలో నిమిషాల వ్యవధిలో రైల్వే యంత్రాంగం, పోలీసులు, వైద్య బృందాలు ఒకటై అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. దేశంలోనే తొలిసారిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఓ మానవ హృదయాన్ని అత్యంత వేగంగా తరలించి సరికొత్త రికార్డు సృష్టించారు.
ఒకరి మరణం.. నలుగురికి పునర్జన్మ!
ఒడిశాకు చెందిన మిథున్ లక్ష్మణ్ స్వైన్ (36) అనే యువకుడు గుజరాత్లోని సూరత్ సమీపంలో ఉపాధి పొందుతున్నాడు. ఇటీవల అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కుటుంబ సభ్యులు సూరత్లోని న్యూ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, మిథున్ అవయవాలను దానం చేసేందుకు అతడి భార్య, సోదరుడు ముందుకు వచ్చారు. దీంతో ఆయన గుండె, కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించి నలుగురి ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్యులు ప్రణాళిక సిద్ధం చేశారు.
సాధారణంగా అవయవాలను విమానాలు లేదా గ్రీన్ కారిడార్ రోడ్డు మార్గాల ద్వారా తరలిస్తుంటారు. కానీ ఈసారి భారతీయ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా గుండెను తరలించాలని నిర్ణయించారు. సూరత్ నుంచి అహ్మదాబాద్లోని ఆసుపత్రికి ముంబై సెంట్రల్ - గాంధీనగర్ వందే భారత్లో ప్రత్యేక భద్రత నడుమ ప్రయాణ ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం భద్రపరిచిన హృదయంతో రైలు ఎక్కగా, కేవలం 3 గంటల 37 నిమిషాల్లోనే రైలు అహ్మదాబాద్ స్టేషన్కు చేరుకుంది. రైలు అహ్మదాబాద్ ప్లాట్ఫామ్ నంబర్ 1 పైకి రాగానే, ఆర్పీఎఫ్ బలగాలు, గుజరాత్ పోలీసులు కలిసి క్షణాల్లో ఆసుపత్రికి చేరుకునేలా ప్రత్యేక గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. నిమిషం కూడా ఆలస్యం కాకుండా గుండెను యూఎన్ మెహతా కార్డియాలజీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు వెంటనే శస్త్రచికిత్స పూర్తి చేసి బాధితుడికి అమర్చారు. మిగిలిన అవయవాలైన కాలేయం, మూత్రపిండాలను రోడ్డు మార్గాన తరలించి ముగ్గురు రోగులకు విజయవంతంగా అమర్చారు. అవయవ మార్పిడి ప్రక్రియలో ప్రతి క్షణం ఎంతో విలువైనదని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కొనియాడారు. రైల్వే శాఖ, పోలీసు యంత్రాంగం, వైద్యుల మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం వల్లే ఈ అరుదైన విజయం సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. అటు రైల్వే అధికారులు కూడా ఈ ఘట్టాన్ని భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత గర్వకారణమైన క్షణంగా అభివర్ణించారు.' రైలులోనే "గ్రీన్ కారిడార్".. సూపర్ ఫాస్ట్ రవాణా
ప్లాట్ఫామ్ నుంచి ఆసుపత్రి వరకు మెరుపు వేగం
Vande Bharat సూపర్ ప్లాన్.. ఒకే వీకెండ్లో పుణ్యక్షేత్రాల దర్శనం!
యంత్రాంగాల సమన్వయానికి పరాకాష్ట!