sabarimala: Makaravilakku 2021 -శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం -5వేల మందికే


కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలో నేడు అత్యున్నత ఘట్టం చోటుచేసుకోనుంది. అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం సంక్రాంతి రోజున లభించనుంది. ఈ సందర్భంగా గురువారం అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది.

Advertisement

దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని ఆశపడతారు. మకరజ్యోతిని వీక్షించి, తరించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. శబరిమలకు వచ్చే భక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని సూచించారు.

Advertisement

శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదం

కేవలం ఐదు వేల మంది భక్తులు, అర్చకులు, అధికారుల సమక్షంలో మకరవిలక్కు ఉత్సవాలు జరగనున్నాయి. శబరిమల చరిత్రలోనే మొదటిసారి మకరసంక్రాంతి నాడు ఇలా నిరాడబరంగా పూజలు జరుగుతున్నాయి. ఈసారి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కట్టుదిట్టమైన భద్రత, కొవిడ్ ప్రొటోకాల్స్ నడుమ ఈ ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి..

అయ్యప్పస్వామికి మకర సంక్రాంతి ఎంతో ఇష్టమైనది. తనకు ఇష్టమైన ఈరోజున తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనం ఇస్తానని అయ్యప్పస్వామి చెప్పారని చరిత్ర చెబుతోంది. అందుకే అయ్యప్పస్వామి మాల వేసిన ప్రతి భక్తుడు మకర సంక్రాంతిన శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని, మకరజ్యోతిని చూడాలని ఆశపడుతుంటారు. అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టమైన బంగారు నగలు తీసుకెళ్లే తిరునాభరణం కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఇవాళ..

Advertisement

షాకింగ్: పిల్లి కళేబరాన్ని తొవ్వి తీసి -కూరలా వండుకుని తిన్న సెలబ్రిటీ -పెను దుమారం

మకర జ్యోతి కనిపించే సమయంలో.. సన్నిధానం, ఆ పరిసరాలు ఆశ్రయ మంత్రాలతో అస్పష్టంగా ఉంటాయి. అప్పుడు పద్దెనిమిదవ దశకు అధిరోహణ ప్రారంభమవుతుంది. ఇది ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో జరుగుతుంది. శరణకుట్టి ఆరోహణ 19 న జరుగుతుంది. 19వ తేదీ వరకు మాత్రమే భక్తులకు కలియుగవారదాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ నడక మార్గం 20వతేదీన ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు గణపతి హోమం జరుగుతుంది. రాజ కుటుంబ సభ్యుల దర్శనం తరువాత హరివరసాన గానంతో మరుసటి రోజు ఉదయం ఆరున్నరగంటలకు ఊరేగింపు ముగుస్తుంది. దీంతో మకరవిలక్కు పండుగ ముగుస్తుంది.

English Summary

With just hours left for the Makaravilakku festival to begin at Sabarimala, all arrangements have been completed for the smooth conduct of the event amidst COVID-19 restrictions. As part of it, purification rituals, including the Bimbasudhi, were performed at the temple under the leadership of Tantri Kandararu Rajeevaru. Thiruvabharanam, the sacred ornaments of the presiding deity, will be brought to the temple in a procession by Thursday evening, which will be followed by Deeparadhana, sighting of the Makarajyothi, and the Makarasamkrama Puja.
Advertisement