GOBARdhan scheme: చెత్త నుంచి బంగారం.. పదేళ్ల పాటు ఫిక్స్డ్ ప్రైస్

దేశీయంగా ఇంధన రక్షణను పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆదాయ మార్గాలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ. 23,731 కోట్ల భారీ వ్యయంతో కూడిన 'గొబర్ధన్' పథకానికి ఆమోదముద్ర పడింది.

Advertisement

వ్యవసాయ వ్యర్థాలు, పేడ, పురపాలక చెత్తను స్వచ్ఛమైన కంప్రెస్డ్ బయో గ్యాస్ గా మార్చడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తూ, ఈ పథకం రాబోయే పదేళ్ల కాలానికి అమల్లో ఉంటుందని తెలిపారు.

Advertisement

పదేళ్ల దాకా ఫిక్స్డ్ రేటు.. ప్రాజెక్టులకు భారీ ఊరట!

బయో గ్యాస్ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వం మార్కెట్‌లో ధరల స్థిరత్వాన్ని తెచ్చింది. ప్రాజెక్టు నిర్వాహకులకు గిట్టుబాటయ్యేలా మెట్రిక్ మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ధరను రూ. 2,110 గా నిర్ణయించి, పదేళ్ల పాటు స్థిరమైన ప్రైసింగ్ మోడల్‌ను అమల్లోకి తెచ్చింది.

ప్రతిరోజూ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బట్టి కొత్తగా పెట్టే ప్లాంట్లకు టన్నుకు గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సహాయం అందించనుంది. అంతేకాకుండా తయారుచేసిన బయో గ్యాస్‌ను సీటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల ద్వారా తప్పనిసరిగా కొనుగోలు చేసేలా కలపడం నిబంధనలను ప్రభుత్వం విధిగా అమలు చేయనుంది.

Advertisement

రైతులకు, MSME లకు సరికొత్త ద్వారాలు!

ఈ పథకంతో కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా రైతులకు, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది. పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలు, పశువుల వ్యర్థాలకు సరైన వ్యాపార విలువ లభించడంతో పాటు సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి కూడా పెరగనుంది.

ఉన్నపళంగా పాస్ అయిన టాక్స్ బిల్లు! పన్నుల్లో భారీ మార్పులు

బయో గ్యాస్ ప్లాంట్లను గ్యాస్ పైప్‌లైన్లతో అనుసంధానించడానికి, అలాగే నిధుల సమస్య రాకుండా MSME ప్రాజెక్టులకు క్రెడిట్ గ్యారెంటీ కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను తీర్చిదిద్దింది. దీనివల్ల రాబోయే రోజుల్లో బయో గ్యాస్ ఉత్పత్తి పది రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

రూ. 8,970 కోట్లతో అస్సాంలో గ్రీన్ ఫీల్డ్ కారిడార్!

గొబర్ధన్ పథకంతో పాటు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో రవాణా రంగానికి మహర్దశ కల్పించే మరో కీలక ప్రాజెక్టుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారి (NH-15) పరిధిలోని గౌహతి-తేజ్‌పూర్ మధ్య 135.87 కిలోమీటర్ల మేర 4-లేన్ యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

PM Modi: ఐదేళ్లలో 550 కోట్లు.. మోదీ విదేశీ టూర్ల ఖర్చు బయటపెట్టిన కేంద్రం

బివోటి టోల్ విధానంలో రూ. 8,970.20 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. సైనిక అవసరాల కోసం తేజ్‌పూర్ బైపాస్ వద్ద 4.9 కిలోమీటర్ల అత్యవసర ల్యాండింగ్ సదుపాయాన్ని కూడా భారత్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి ఇక్కడ నిర్మించడం గమనార్హం.

English Summary

Union Cabinet approves the Rs 23,731-crore GOBARdhan Bioenergy Scheme to multiply CBG production, along with the Rs 8,970-crore Guwahati-Tezpur corridor in Assam.