అయోధ్య రామాలయ విరాళాల స్కాం విచారణ వేళ కీలక పరిణామాలు..!!

అయోధ్య రాముడి విరాళాల దుర్వినియోగం పై విచారణ కొనసాగుతోంది. కీలక అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం పైన చర్చ జరుగుతోంది. హిందూ సంఘాలు పూర్తి స్థాయి విచారణ చేసి దోషులను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆరెస్సెస్ నేతలు ఘాటుగా స్పందించారు. తాజాగా విశ్వ హిందూ పరిషత్ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. తప్పు చేసిన వారిని పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు.

Advertisement

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు ఇప్పుడు చర్చగా మారింది. దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం పైన పలువురు ప్రముఖులు స్పందించారు. కాంగ్రెస్ నేతలు నేరుగా బీజేపీ తో పాటుగా అనుబంధం సంఘాలను టార్గెట్ చేస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సైతం బీజేపీ పైన విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయోధ్యతో పాటు కాశీ వంటి తీర్ధక్షేత్రల్లోనూ ఇలాంటివి జరిగి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేసారు. అయోధ్య ఆలయంలో విరాళాల దుర్వినియోగం చేసారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణ చేస్తున్నారు. బంగారపు బిస్కెట్లు వారి నుంచి గుర్తించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం పైన విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి ఘటనలతో ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని.. తప్పు చేసి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.

Advertisement

విశ్వహిందూ పరిషత్ తాజా డిమాండ్

ఇదే సమయంలో ఈ వివాదాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ముడి పెట్టి విమర్శలు చేయటం సరి కాదని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యత పూర్తిగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీసుకోవాలని తేల్చి చెప్పారు. విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ కు ముడిపెట్టటం సరి కాదని సూచించారు. చంపత్ రాయ్ వీహెచ్పీ సీనియర్ నేతే అయినా.. ట్రస్టులో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధిగా లేరని వివరణ ఇచ్చారు. ఈ స్కాంలో చంపత్ రాయ్ ప్రమేయం బయటకు రాలేదని గుర్తు చేసారు. దర్యాప్తు పూర్తి కాకుండా ఆయన పై చర్యలు తీసుకోవాలని తాము కోరుకోవటం లేదన్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. సీనియర్ అధికారులతో దర్యాప్తు చేయాలని సూచించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజు వారీ విచారణ చేయటం ద్వారా నాలుగైదు నెలల్లోనే దోషులకు శిక్ష పడేలా చూడాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

English Summary

VHP International President Alok Kumar has sought a fast-track investigation into the alleged embezzlement of Ayodhya Ram Mandir donations