ఢిల్లీ నుంచి షేక్ హసీనా తొలి ప్రసంగం: కన్నీళ్లు పెట్టుకున్న మాజీ ప్రధాని!

హింసాత్మక విద్యార్థి నిరసనలు, రాజకీయ కుట్రల కారణంగా 2024 ఆగస్టు 5న అప్పటి ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను హఠాత్తుగా విడిచి వెళ్లవలసి వచ్చింది. అధికారాన్ని కోల్పోయి ఢాకా నుంచి ఇండియాకు వచ్చినప్పటి నుండి, షేక్ హసీనా మీడియా దృష్టికి, కెమెరాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు రెండేళ్ల నిరీక్షణ తర్వాత,షేక్ హసీనా తొలిసారిగా ఒక బహిరంగ వేదికపై ప్రత్యక్షంగా కనిపిస్తూ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.

Advertisement
షేక్ హసీనాకు భారత్ తొలి షాక్- బంగ్లాదేశ్ హ్యాపీ- కీలక వ్యాఖ్యలు..!
Advertisement

తిరుగుబాటుకు రెండేళ్లు పూర్తి

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా (FCC) నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని వర్చువల్‌గా పాల్గొన్నారు. యాదృచ్ఛికంగా నేడు ఆగస్టు 5వ తేదీ, ఆమె 15 ఏళ్ల ప్రభుత్వాన్ని కూలదోసిన సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ వీధుల్లో హింస చెలరేగి, ఆగ్రహించిన నిరసనకారులు ప్రధానమంత్రి నివాసంపై దాడి చేసినప్పుడు, షేక్ హసీనా హఠాత్తుగా దేశం విడిచి వెళ్లాలనే నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇండియాలోని ఓ సురక్షితమైన, రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. ఈ కాలంలో ఆమె నుంచి కొన్ని రాతపూర్వక ప్రకటనలు, ఆడియో సందేశాలు వెలుగులోకి వచ్చాయి, కానీ ఆమె ఏ వీడియో లేదా ప్రత్యక్ష పత్రికా సమావేశంలోనూ వ్యక్తిగతంగా కనిపించలేదు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఆమె అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల ముందు వర్చువల్‌గా ప్రత్యక్షమై ఈ సుదీర్ఘ మౌనాన్ని వీడారు.

Advertisement

కన్నీళ్లు పెట్టుకున్న హసీనా
తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే షేక్ హసీనా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కష్టంతో ఆమె.. "ఈ రోజు నేను కేవలం మాజీ ప్రధానిగా మాత్రమే కాకుండా జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తెగా కూడా మాట్లాడుతున్నాను" అని షేక్ హసీనా అన్నారు. 1975లో ఢాకాలో షేక్ ముజిబుర్ రెహమాన్‌తో పాటు హత్యకు గురైన తన కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుంటూ హసీనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇది శాంతియుత ఉద్యమం కాదని ఆమె అన్నారు.

Air India : ఎయిర్ ఇండియా కొత్త CEO గా తెఓల్డే గెబ్రెమరియమ్‌
Advertisement

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ, "గత రెండేళ్లుగా బంగ్లాదేశ్ కష్టాలతో సతమతమవడం నేను చూశాను. ఇది మనం సృష్టించిన బంగ్లాదేశ్ కాదు, 1971లో 30 లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేసిన బంగ్లాదేశ్ కూడా ఇది కాదు. నేను 2024 జులై ఆగస్టు నెలల వాస్తవాలతో మొదలుపెట్టాలనుకుంటున్నాను. ఇది శాంతియుత విద్యార్థి ఉద్యమం కాదు. మొదటి నుంచీ నా ప్రభుత్వం ఈ సమస్యను చర్చలు, న్యాయ ప్రక్రియ, సహనం ద్వారా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించింది. కానీ సంస్కరణల ముసుగులో, కొన్ని వ్యవస్థీకృత బృందాలు విద్యార్థుల డిమాండ్లను హింసాత్మక రాజకీయ ఆయుధంగా మార్చడానికి ప్రయత్నించాయి." అని షేక్ హసీనా పేర్కొన్నారు.

Advertisement

ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరిగిన కుట్ర
తన ప్రభుత్వాన్ని కూలదోసిన 2024 తిరుగుబాటు వాస్తవానికి విద్యార్థుల నిరసనల ముసుగులో జరిగిన ఓ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని షేక్ హసీనా ఆరోపించారు. తన ఆడియో ప్రసంగంలో హసీనా మాట్లాడుతూ.. జులై-ఆగస్టు 2024 ఉద్యమం ఎన్నడూ నిజమైన విద్యార్థి నిరసన కాదని అన్నారు. దానికి బదులుగా, ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కనపెట్టి, తన ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అది జాగ్రత్తగా పన్నిన ఆపరేషన్ అని ఆమె ఆరోపించారు. నిజమైన విద్యార్థులను పదేపదే తప్పుదోవ పట్టించారని.. కొన్ని బృందాలు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పని చేశాయని షేక్ హసీనా పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని మార్చడమే వారి ప్లాన్ అంటూ ఆమె వెల్లడించారు. మహమ్మద్ యూనస్ స్వయంగా చెప్పిన మాటలే నిజాన్ని వెల్లడించాయని. ఇది పక్కా ప్రణాళికతో చేసిన ఆపరేషన్ అని ఆయన అంగీకరించారని షేక్ హసీనా తెలిపారు. బ్యాలెట్ పెట్టె ద్వారా ఎన్నికైన వ్యవస్థ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశమంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

హంతకులను రక్షించిన మహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్‌ను ఉద్దేశించి.. పోలీసుల హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న ఆయన ప్రభుత్వ నిర్ణయం, వారి అసలు ఉద్దేశాలను బయటపెడుతోందని మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు. తాను ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించానని, అయితే మహమ్మద్ యూనస్ 'చట్టవిరుద్ధమైన తాత్కాలిక ప్రభుత్వం' దానిని నిలిపివేసిందని ఆమె అన్నారు. వారికి భయం లేకపోతే, నిజం బయటకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు? అని షేక్ హసీనా ప్రశ్నించారు.

మైనారిటీ వర్గ సభ్యులపై దాడులు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాల సభ్యులు, న్యాయమూర్తులు, సాంస్కృతిక ప్రముఖులు, చివరికి రిక్షా కార్మికులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. "విమోచన పోరాటానికి మద్దతుగా నిలిచే వారిపై దాడులు జరుగుతున్నాయి," అని హసీనా అన్నారు.

షేక్ హసీనా కుమారుడి ప్రసంగం
షేక్ హసీనాను పదవి నుంచి తొలగించిన తర్వాత కూడా హింస ఆగలేదని, 2024 ఆగస్టు నిరసనల తర్వాత కూడా హత్యలు కొనసాగాయని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి నివేదించిన మరణాల సంఖ్యకు, ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ప్రశ్నించారు. 'నష్టపరిహారం' అనే చర్య కింద నిరసనకారులకు మినహాయింపు ఇచ్చారని ఆరోపించారు. పదవీచ్యుతి అనంతరం జరిగిన హింసాకాండను అంతర్జాతీయ మీడియా నిశితంగా పరిశీలించాలని ఆయన కోరారు.బంగ్లాదేశ్ 'మరో పాకిస్థాన్'గా మారిందని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ ఆరోపించారు. ఈ పరిణామం ఇండియాకు ఆందోళన కలిగించే విషయం అని అన్నారు.

English Summary

Sheikh Hasina breaks her silence from New Delhi after 2 years. Read about her emotional speech, conspiracy allegations against Muhammad Yunus, and Bangladesh updates.