భావోద్వేగాలను రెచ్చగొట్టి మోడీ ఎన్నికల్లో విజయం సాధించారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశభక్తి, జాతీయత అనే సెంటిమెంట్లను, భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించారని విమర్శించారు. బీజేపీ లేకపోతే దేశానికి భద్రత, రక్షణ లేదన్ అభద్రతా భావాన్ని సృష్టించి గెలిస్తే అదో గెలుపా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారా? అలా అయితే మోడీ ఏం పని చేసి గెలిచాడని, దేశానికి ఆయన ఏం చేశాడని కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ భవన్తో పార్టీ నేతలతో భేటీ, ప్రగతి భవన్లో నాలుగు గంటలకుపైగా జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీయే కాదని, రాష్ట్రంలో అతిపెద్ద శక్తివంతమైన పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని చెప్పారు. రాజకీయంగా రాష్ట్రంలో టీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలంటే యుద్ధమని, యుద్ధాన్ని యుద్ధం చేసే గెలవాలని అన్నారు.
ఎన్నికలు, అభివృద్ధి వేర్వేరు అంశాలన్న కేసీఆర్.. మున్సిపల్ఎన్నికలు సకాలంలో జరుగుతాయని స్పష్టంచేశారు. కొత్త మున్సిపల్ చట్టానికి అసెంబ్లీ ఆమోద ముద్ర వేయించుకున్నాక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద మోడీ ప్రజల్లో భావోగ్వేదాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.