పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందన్న మోడీ కామెంట్ను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి
పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పదును మరింత పెరుగుతోంది. కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోడీ.. వీలైనంత ఎక్కువ మంది జనంతో మమేకమయ్యే ప్రయత్నంచేస్తున్నారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి పోలవరం పూర్తి చేసే ఉద్దేశంలేదని విమర్శించిన ఆయన.. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.7వేల కోట్లు కేటాయించామన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు అంచనాలను పెంచుతూ పోతున్న యూటర్న్ బాబు.. ఎవరి ప్రయోజనాల కోసం అలా చేస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు. పోలవరం విషయంలో బాబు తీరును విమర్శిస్తూ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.