అక్బరుద్దీన్ కేసులో కోర్టు చెబితే కానీ కదలని కరీంనగర్ పోలీసులపై మీ కామెంట్ ఏంటీ ?
హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. శాసన, కార్యనిర్వహక, న్యాయశాఖలు కీలక పాత్ర పోషిస్తాయి. వారి తర్వాత ఫోర్త్ ఎస్టేట్గా మీడియా క్రియాశీలక పాత్ర పోసిస్తోంది. కానీ కార్యనిర్వహక శాఖలో భాగమైన పోలీసులు కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప తమ పనిచేయడం లేదు. కొన్ని సందర్భాల్లో వారిపై పొలిటికల్ ప్రెషర్, మరికొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంతో కేసులను పట్టించుకునే పోలీసులు కరవయ్యారు. డిపార్ట్ మెంట్లో ఒకరిద్దరు ఖాకీలే తమ విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మరోసారి నోటిదురుసు ప్రదర్శించినా సంగతి తెలిసిందే. 15 నిమిషాల వ్యాఖ్యలపై బీజేపీ, ఆరెస్సెస్ భయపడ్డాయని ఇటీవల కరీంనగర్లో అక్బరుద్దీన్ కామెంట్ చేశారు. అయితే అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని కరీంనగర్ పోలీసులు క్లీన్ చీట్ ఇవ్వడంతో బీజేపీ నేతలు తప్పుపట్టారు. కోర్టులో పిటిషన్ వేయడంతో కరీంనగర్ కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో కరీంనగర్ పోలీసులు స్పందించారు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్పై న్యాయస్థానం ఆదేశాలతో 24 గంటల్లోపే పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే కోర్టు చెబితే తప్ప పోలీసులు స్పందించర అనే ప్రశ్న తలెత్తుతుంది. మన పోలీసులకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోని కేసు పెట్టాలని కోరితే తప్ప రియాక్ట్ కారా అని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప కరీంనగర్ పోలీసులు స్పందించని వైనంపై మీ కామెంట్ తెలియజేయండి.