చైనాకు బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలో మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి..!
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్ -చైనా మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్తో సహా 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలసిందే. డ్రాగన్ కంట్రీ పాల్పడిన ఈ ఘాతుకంపై భారత్ భగ్గుమంది. ఈ కష్ట సమయాల్లో దేశం ఒక్కతాటిపైకొచ్చింది. ఈ క్రమంలోనే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని దేశం భావిస్తోంది. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే భారత్ ఏం చేయాలి.. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలా... ఇది చేస్తే సమస్యకు పరిష్కారం దక్కుతుందా..? చైనా వస్తువులను భారత్లో నిషేధిస్తే సరిపోతుందా..? ఇంకా ఎలా రియాక్ట్ అవ్వాలో మీ అభిప్రాయం వన్ఇండియాకు తెలియజేయండి.
భారత్-చైనా వివాదంపై మీరు ఇచ్చే సలహాలను సూచనలను మాకు తెలపండి. ఈ కింద ఇచ్చిన మెయిల్ ఐడీకి మీ కామెంట్లను పోస్టు చేయండి. మీ అభిప్రాయాలను ఒక కథనంగా రాసి ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం.. చైనా పాల్పడిన ఘాతుకానికి ఎలాంటి జవాబు ఇవ్వాలో వన్ఇండియాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను [email protected] కు పంపండి. అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.