హాజీపూర్ సైకో కిల్లర్కు ఎలాంటి శిక్ష పడాలి.ఇప్పుడున్న చట్టాలు అందుకు సరిపోతాయా?మీ కామెంట్ చెప్పండి
హాజీపూర్ సైకో కిల్లర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. అమ్మాయిలపై అత్యాచారం చేసి వారిని దారుణంగా హతమార్చి బావిలో పూడ్చిపెట్టిన ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అభం శుభం తెలియని విద్యార్థినులు శ్రావణి, మనీషా, కల్పన హత్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ అట్టుడుతోంది.
నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్థులు ఆ నరరూప రాక్షసున్ని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, అతనికి మరణ శిక్ష పడేలా కేసు పెట్టాలని అంటున్నారు. అలాకాని పక్షంలో ప్రజాకోర్టులో ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న మానవమృగానికి ఎలాంటి శిక్ష విధించాలని కోరుకుంటున్నారు? అలాంటి శిక్ష విధించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయా? చట్టాల్లో ఉన్న లోపాలు నిందితున్ని ఉరికంబం ఎక్కనిస్తాయా? వీటిపై మీ అభిప్రాయాన్ని, సలహాలు, సూచనల్ని కామెంట్ రూపంలో చెప్పండి.