అనసూయలో ఏదో తెలియని కిక్కు ఉందబ్బా...!
యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్లు కొట్టేసింది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది
అందం,నటనతో అనసూయ చాలామంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫొటోలోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సంక్రాంతి సందర్భంగా తన సోషల్ మీడియాలో కొన్నిఫొటోలను షేర్ చేసింది. టెంప్టింగ్ అందాల షోతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది.సోకులన్నీ ప్రదర్శించేస్తూ.. రెచ్చిపోతుంది. భామ హాట్ షోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఎద అందాలు చూపిస్తూ దిగిన ఫొటోలు అయితే హైలెట్గా నిలిచాయనే చెప్పాలి. చీరలో కూడా అనసూయ తనదైనశైలిలో అందాలు ఆరబోసింది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ అనసూయ కుర్రాళ్లకు కనువిందు చేసింది.
రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ హీరోయిన్స్కే అసూయ పుట్టేలా అందాలన్నీ ప్రదర్శిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అనసూయ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నా కళ్లకు ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నావు డార్లింగ్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే ...అనసూయలో ఏదో తెలియని కిక్కు ఉందబ్బా అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications