లైవ్లో చెప్పుతో కొట్టిన రాజ్ తరుణ్ లవర్ లావణ్య (వీడియో)
హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని ..తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ నాకు కావాలని తాను ఆయనతోనే ఉండాలని కోరుకుంటానని లావణ్య స్పష్టం చేసింది.
లావణ్య చేసిన ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్ .. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్తో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు. ఇరువురు కూడా ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం జరిగింది.

రాజ్ తరుణ్ కొత్త సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా లావణ్య రచ్చ చేసింది. తన భర్తను కలవడానికి వచ్చానంటూ మీడియా ముందు నానా హంగామా సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న లావణ్య అక్కడే ఉన్న ప్రముఖ ఆర్జే శేఖర్ భాషాను చెప్పుతో కొట్టడం జరిగింది లావణ్య, ఆర్జే శేఖర్ భాషా టీవీ డిబేట్లో పాల్గొన్నారు. హీరో రాజ్ తరుణ్కు మద్దతుగా ఆర్జే శేఖర్ భాషా ఈ డిబేట్లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్జే శేఖర్ భాషా మాట్లాడుతూ..లావణ్య చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోందని ఆరోపించాడు. దీంతో కోపం వ్యక్తం చేసిన లావణ్య ,అతన్ని చెప్పుతో కొట్టింది. ఇదింతా కూడా లైవ్లోనే జరిగింది. దీంతో డిబేట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే వారిని విడదీసే ప్రయత్నం చేశారు.
Ela Barimchav bro #RajTharun 🙏
— VamCKrishna (@vamCKrishna__3) August 1, 2024
pic.twitter.com/CnIHTaLWWO
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో ముందస్తు బెయిల్ కోసం రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రేపటికి(శుక్రవారం) వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications