పోలీసు వార్ వివాదం
కాంగ్రెస్లో నీటి విభేదాలు మొదలయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు విషయంలో తలెత్తిన వివాదం ఢిల్లీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి భూమిపూజ చేసినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల గుండెలు రగిలిపోతున్నాయి. బయటకు చెప్పలేక, లోన దాచుకోలేక వారు సతమవుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు భూమి పూజ చేయడాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి వ్యతిరేకించారు. మరో సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ బయట పడ్డారు. ఇది కోస్తా కాంగ్రెస్ నాయకులకు కోపం తెప్పించింది. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా పులిచింతల ప్రాజెక్టుకు వైయస్ పునాది రాయి వేయడం సహజంగానే బాధ కలిగించింది.