వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్నికల ప్రచారాలే!
పదిహేనేళ్లు పై పడిన ద్విచక్రవాహనాలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మధ్య తరగతి వర్గాల్లో తీవ్ర ఆందోళన సృష్టిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వున్న వేలాది మంది వాహనదారులు ప్రభుత్వం నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో వినిమయ సంస్కృతి ఇప్పుడిప్పుడే ఊడలు దిగుతున్నది. ఒక వస్తువును కొంటే దాన్ని కొన్ని తరాలపాటు పదిలంగా కాపాడుకునే అలవాటు మనదేశ జనాభాలో అత్యధిక శాతానికి వుంటుంది. అమెరికా వంటి పెట్టుబడిదారి సమాజాల్లో యూజ్ అండ్ త్రో కల్చర్ విస్తృతంగా వుంటుంది. ఏ వస్తువునైనా పరిమిత కాలం ఉపయోగించి అవసరం తీరిన వెంటనే దానిని పారవేసి మరో కొత్త వస్తువుకు వెళ్లడం అక్కడ రివాజు.
Comments
Story first published: Sunday, November 5, 2000, 23:53 [IST]