వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారుణ్యకు ఓటేయండి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మట్టిలో మాణిక్యం ఉంటుందనికృష్ణస్వామి అనే విద్యార్థి నిరూపించాడు.అతిపేద కుటుంబం నుంచి వచ్చినకృష్ణస్వామి చదువులో రాణిస్తూమొదటి ప్రయత్నంలోనే మెడిసిన్‌సీటు సంపాదించాడు. ఎంసెట్‌లో 802 ర్యాంక్‌సాధించిన కృష్ణస్వామికి వరంగల్‌లోనికాకతీయ మెడికల్‌ కాలేజీలో సీటువచ్చింది. సీటైతే వచ్చింది కానీచదవడానికి డబ్బులు లేక కృష్ణస్వామివిలవిలాడుతున్నాడు. నల్లగొండ జిల్లాబొందుగుల గ్రామానికి చెందినకృష్ణస్వామి తలిదండ్రులు బల్దెపుష్పమ్మ, నరసయ్య రోజువారీ కూలీపైబతుకు వెళ్లదీస్తున్నారు.నిరక్షరాస్యులైన ఈ తలిదండ్రులకడుపున పుట్టిన కృష్ణస్వామిమొదటి నుంచి చదువులో తనప్రతిభను కొనసాగిస్తూనే ఉన్నాడు.ఒకటోతరగతి నుంచి ఏడో తరగతి వరకుబొందుగులలోని పాఠశాలలో చదివాడు. ఆతర్వాత ఎనిమిది నుంచి పదో తరగతివరకు నాగార్జునసాగర్‌లోనిఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లోచదివాడు. పదో తరగతిలో 94 శాతంమార్కులు సాధించాడు. అయితే ఆ తర్వాతచదువు కొనసాగించడం కృష్ణస్వామికికష్టంగానే మారింది. ఈ విషయాన్నితెలుసుకున్న హనుమకొండకుచెందిన ఎస్‌ ఆర్‌ కాలేజీ అతనికి ఇంటర్‌లోఉచితంగా విద్యను అందించింది. ఇంటర్‌ విద్యతోపాటు ఎంసెట్‌లో కోచింగ్‌ కూడా ఇచ్చింది.ఇంటర్మీడియట్‌లో 92 శాతం మార్కులుసాధించాడు ఆ విద్యార్థి. ఆ తర్వాతవెనువెంటనే రాసిన ఎంసెట్‌లో మంచిర్యాంక్‌ సాధించడంతో కాకతీయమెడికల్‌ కాలేజీలో సీటు వచ్చింది.మెడిసిన్‌చదువు ఎలా కొనసాగించాలా అనేఆందోళనలో పడిన కృష్ణస్వామికికొందరు అండగా నిలిచారు. సైబరాబాద్‌పోలీసు కమీషనరేట్‌ పరిధిలోనిసరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ సర్కిల్‌ఇన్‌స్పెక్టర్‌ ఎం. చంద్రశేఖర్‌ కొంతఆర్థిక సాయం అందించారు. బొందుగులకేచెందిన చంద్రశేఖర్‌ అతనికి భరోసాఇచ్చారు. మరికొంత మంది దాతలు కొంతఆర్థిక సహాయం అందించారు. దీంతో అతనుమెడిసిన్‌ కోర్సులో చేరాడు. ఆ డబ్బులుమెడిసిన్‌లో చేరడానికి సరిపోయాయి.ఆతర్వాత విషయం తెలుసుకున్నకొంత మంది ప్రవాస భారతీయులుసహాయం అందించడానికి ముందుకువచ్చారు. నల్లగొండ డాట్‌ ఆర్‌ సహాయంఅందించడానికి ముందుకు వచ్చింది. స్ప్రెడ్‌ ఇండియా తరఫునసహాయం అందజేసే ఆలోచన తమకుఉన్నదని సంస్థ తెలియజేసింది ఈ స్థితిలోకృష్ణస్వామికి పూర్తి ఊరట లభించినట్లే.దాదాపుగా అతను మెడిసిన్‌ పూర్తిచేయడానికి ఆటంకాలు తొలగిపోయినట్లే.కార్డియాలజీచదివి పేదలకు సేవలందించే ఉద్దేశంతనకు ఉన్నదని కృష్ణస్వామిచెబుతున్నాడు. తాను వచ్చిన గ్రామీన,నిరుపేద నేపథ్యాన్ని తాను ఎన్నడూమర్చిపోనని ఆయన అంటున్నాడు. తానుచదువు కొనసాగించడానికి సహకరించినవారిని ఎప్పుడూ గుర్తుంచుకుంటానని కూడాఅతను అంటున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X