వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఈసేవమధురం
ఈ మధ్య ఐఎఎస్ అధికారుల్లో రెండు మూడు సార్లు భారీ మార్పులు జరిగినా పట్టించుకోని పరిశీలకులు తాజాగా జరిగిన బదిలీలపై మాత్రం దృష్టి సారిస్తున్నారు. చాలా రోజులుగా పరిశీలకులు ఊహిస్తున్నట్టగానే హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ పికె మహంతి ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన రాకతో పాటు సిఎంకు అత్యంత విశ్వాసపాత్రుడైన అధికారిగా పేరున్న సాంబశివరావు కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లడం మరో విశేషం. చాలా ఎళ్లుగా ఎంసిహెచ్ను స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఎదురులేకుండా ఏలుతున్న మహంతి కూడా ముఖ్యమంత్రి అస్మదీయ వర్గంలోని వాడే.
Story first published: Friday, January 19, 2001, 23:53 [IST]