వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠకులకు చిన్నవిన్నపం

By Staff
|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ప్రభుత్వ ఎజెన్సీలపై నమ్మకం సడలిన క్షణంలో బాధితులకున్న ఏకైక ఆప్షన్‌ సిబిఐ మాత్రమే. కొద్ది సంవత్సరాల క్రితం వరకు సిబిఐ దర్యాప్తు అంటే దానికో ప్రత్యేకత, పవిత్రత (?) వుండేవి. కోడెల శివప్రసాదరావు కేసు తర్వాత సిబిఐ-సిఐడి దొందు దొందేనన్న స్థితి ఏర్పడింది. పైగా కేంద్రంలో వుంది కూడా ఇక్కడి ప్రభుత్వం దయపై ఆధారపడి బతుకునీడుస్తున్న సంకీర్ణమాయే.
అసెంబ్లీలో విపక్షాలు ప్రత్యూష టాపిక్‌ లేవనెత్తిన వెంటనే చకాచకా సిబిఐ దర్యాప్తునకు అంగీకరించడం, అవసరమైతే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని ధాటిగా ప్రకటించింది. ప్రత్యూష కేసులో ప్రభుత్వానికి లభించిన అవకాశం ఇది. దుమారం సృష్టిస్తున్న మీడియా నుంచి తప్పుకోవడానికి మార్గం. నేరం చేయడం వేరు. నేరాన్ని చట్టబద్దంగా మరుగుపర్చడం వేరు. ప్రత్యూష కేసులో అదే జరుగుతున్నది. మీడియాలో కొంత మందికి, సీనియర్‌ పోలీసు అధికారుల్లో అనేక మందికి ప్రత్యూష కేసుకు సంబంధించి ఏం జరిగిందో బాగా తెలుసు. కేసును పకడ్బందీగా పక్కదారి పట్టించడంలో స్థానిక పోలీసులు విఫలమైన కారణంగా ఇంత దుమారం చెలరేగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X