వైద్య విద్యార్థిని రాజ్యలక్ష్మికి వైయస్ చేయూత
భారతదేశంలోస్వాతంత్య్ర ఉద్యమాల తర్వాత ఒకమౌలిక అంశాలతో సుదీర్ఘమైన ఆలోచనావిధానాలతో, ఒక శాస్త్రీయమైన పద్ధతిలోదేశ ఆర్థిక, రాజకీయ రంగాల్లో పెనుమార్పును సాధించడానికి దీర్ఘకాలికప్రణాళికతో విప్లవోద్యమాలుబయలుదేరినట్లు గత ముప్పై యేళ్లఉద్యమాలను విశ్లేషించినట్లయితేఅర్థమవుతుంది. ఈ ఉద్యమాలకు ఎందరోమేధావులు, రాజకీయవేత్తలు, ఆర్థికనిపుణులు, కార్మికులు, కర్షకులు,మహిళలు, విద్యార్థులు, రైతులు,రైతు కూలీలు ఆకర్షితులై తమవంతు భాగస్వామ్యాన్ని పంచి ఇచ్చినారు.ఎందరో తమ ఆస్తుల్ని కోల్పోయారు.మరెందరో తమ అమూల్యమైనప్రాణాలనే ఫణంగా పెట్టారు. గ్రామీణప్రాంతాల్లోని రైతులు, రైతుకూలీలు,యువకులు, మహిళలు తీవ్రమైనరాజ్యహింసను భరించారు. ఈ ఉద్యమాలనువిశ్లేషించడమై ఈ విషయంలో న్యాయంచేయలేను, ఇదంతా ఒక ఉద్యమాలచరిత్ర. దీనినంతటిని సవివరంగాచరిత్రకెక్కించవలసిన వాన్ని నేనుకాదు. దీనికి ఎందరో మహానుభావులు,చరిత్రకారులు పూనుకోవాల్సి ఉంది. ఇది నాఒక్కడి వల్ల అయ్యే పని కాదనిపిస్తుంది.