వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మారిన మనిషి
విద్యుత్ చార్జీలు పెరుగుతాయని లెఫ్ట్పార్టీలు శాసనసభ ఎన్నికల కన్నా ముందుగానే హెచ్చరించినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రపంచ బ్యాంకు షరతులు, రానున్న గడ్డుకాలం గురించి ప్రధానంగా సిపిఎం పెద్ద ఎత్తున ప్రచారం చేసినా అది జనంలోకి వెళ్ళలేకపోయింది. ఫలితంగా శాసనసభ ఎన్నికలలో సిపిఎం కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవలసి రాగా సిపిఐ కి ఒక్క సీటు కూడా దక్కలేదు. 1994లో తెలుగుదేశంతో జతకట్టి ఎన్నికల రంగంలో దిగిన వామపక్షాలు 34 స్థానాలు గెలుచుకుని విజయహాసాన్ని చిందించాయి. 1984 నుంచి తెలుగుదేశం మిత్రపక్షాలుగా ఉన్న వామపక్షాలు 1998 లోక్సభ ఎన్నికల తర్వాత విడిపోవలసి వుంది.
Comments
Story first published: Sunday, February 9, 2003, 23:53 [IST]