నిస్సిగ్గు సమర్థన వెనక...
హైదరాబాద్:ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ (ఐయస్డి) విషయంలో హైదరాబాద్పరువు బజారున పడే సూచనలుకనిపిస్తున్నాయి. అక్రమ ఐ యస్డి కాల్హబ్గా హైదరాబాద్ అతి వేగంగామారిపోతోంది.అక్రమ ఐయస్డి కాల్స్పైటెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కుపన్నెండు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులుఅందాయి. ఇందులో రెండు వందల యాబైరెండు ఫిర్యాదులు హైదరాబాద్కుచెందినవే. మొత్తం ఫిర్యాదుల్లోనలబై మూడు శాతంహైదరాబాద్వే. ఈ వివరాలు అందించిందిటెలికమ్ శాఖయే.హైదరాబాద్లోనిమొబైల్ సర్వీస్ ఆపరేటర్లపైటెలికమ్యూనికేషన్ నిఘా విభాగం తీవ్రంగామండిపడుతోంది. సబ్స్క్రయిబర్ గురించిఏ మాత్రం అంచనా లేకుండా సెల్యులార్కనెక్షన్స్ ఇచ్చేస్తున్నారనేది ఆ విభాగంఆక్షేపణ.హైదరాబాద్కుసంబంధించి ఒక నెలలో పదహారు కేసులనునిఘా విభాగం మానిటరింగ్ సెల్ కనిపెట్టింది.ఇవి ఐదు వందల డెబ్బై ఆరుకనెక్షన్లకు సంబంధించినవి. దీని వల్లఆరు కోట్ల రెండు లక్షల రూపాయల నష్టంవాటిల్లినట్లు టెలికమ్ డిపార్ట్మెంట్(నిఘా విభాగం) డిప్యూటీ డైరెక్టర్జనరల్ జి.యస్. గ్రోవర్ మీడియాప్రతినిధులతో చెప్పారు. గతసంవత్సర కాలంగా ఇంటర్నేషనల్ఆంగ్ డిస్టాన్స్, నేషనల్ లాంగ్డిస్టాన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు,బియస్యన్యల్కు ఈ గ్రే కాల్స్ వల్లమూడు వందల యాబై కోట్ల నష్టంవాటిల్లిందని ఆయన చెప్పారు.అత్యధునాతనపరికరాల ద్వారా అక్రమ ఎక్స్ఛేంజీలనుఏర్పాటు చేసుకొని విదేశీ టెలికమ్కారియర్స్ నుంచి గ్రే మార్కెట్ఆపరేటర్లు ట్రాఫిక్ను ఛానలైజ్చేస్తారని ఆయన చెప్పారు. టెలికమ్సర్వీస్ ప్రొవైడర్ల నుంచి దొంగపేర్లతో టెలిఫోన్ లైన్లను లేదామొబైల్ ఫోన్ కనెక్షన్లను పొందివియస్ఎటి లేదా ఐయస్డియన్ లైన్లద్వారా లేదంటా ఇంటర్నెట్ సర్వీస్ప్రొవైడర్ల ద్వారా వాటిని కలుపుతారనిఆయన వివరించారు.