వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ధూమ్‌ ధామ్‌

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:పదవ జాతీయ యువజనోత్సవాలుహైదరాబాద్‌లో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈఉత్సవాలను రాష్ట్ర గవర్నర్‌సుశీల్‌కుమార్‌ షిండే ఈ నెల 22వతేదీన హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్‌ స్టేడియంలో ప్రారంభించారు.కేంద్ర క్రీడల, యువజన సర్వీసులమంత్రి సునీల్‌ దత్‌ ఈ కార్యక్రమానికిహాజరయ్యారు. శాంతి, సద్భావన, అభివృద్ధిసాధన లక్ష్యంగా ఈ యువజనోత్సవాలుజరుగుతున్నాయి. ప్రారంభోత్సవకార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్రయువజన సర్వీసుల మంత్రి హరీష్‌ రావుతదితరులు పాల్గొన్నారు.దేశంలోనిఅన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులుయువజనోత్సవాల్లో పాల్గొంటున్నారు.దేశీయ కళలను ఆయా రాష్ట్రాలకళాకారులు ప్రదర్శించి కనువిందుచేస్తున్నారు. ప్రారంభోత్సవకార్యక్రమంలో అన్ని రాష్ట్రాల కళాకారులుతమ కళా నైపుణ్యాలను ప్రదర్శించిప్రేక్షకుల మన్ననలుఅందుకున్నారు.యువజనోత్సవాలకుహైదరాబాద్‌లోని వివిధ వేదికలనుఖరారు చేశారు. శిల్పారామం, లలితకళాతోరణం వంటి వేదికల మీదకళాకారులు తమ కళలనుప్రదర్శిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో 15 నుంచి 35సంవత్సరాల మధ్య వయస్సు గల 3వేల మంది యువతీయువకులుపాల్గొంటున్నారు. పోటీలు కూడా జరిగాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X