అద్వానీ ఇంటి కథ
న్యూఢిల్లీః కేంద్ర హోం మంత్రి ఎల్ కె అద్వానీకి వ్యతిరేకంగా ఆయన కోడలు గౌరి సబర్వాల్ అద్వానీ హైకోర్టుకు చేసిన ఫిర్యాదు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నది. ఈ వ్యవహారం అద్వానీ వ్యతిరేకులకు చక్కని ఆయుధంగా దొరికింది. చెప్పేవి శ్రీరంగ నీతులంటూ.... అప్పుడే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. నైతికవిలువలు, సనాతన భారతీయ ధర్మం, కుటుంబ విలువల గురించి పనిగట్టుకు ప్రచారం చేసే ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలకు పెద్దదిక్కైన పెద్దమనిషి ఇంట్లో కోడలికే ఇంత అన్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.
అత్తింటి వేధింపులపై లండన్లో సోలిసిటర్గా పనిచేస్తున్న గౌరి దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీహైకోర్టు అద్వానీకి, ఢిల్లీ పోలీసు కమిషనర్కు నోటీసులు కూడా జారీ చేసింది. తన భర్త జయంత్ అద్వానీకి విడాకులు ఇవ్వాలని తనను గత కొంత కాలంగా అత్తింటి వారు వేధిస్తున్నట్టు గౌరి ఆరోపిస్తున్నారు. లండన్లోని భారత డిప్యూటీ హై కమిషనర్ హర్దీప్పూరి తనపై పలుసార్లు ఈ విషయంలో వత్తిడి తెచ్చారని, విడాకులకు అంగీకరించకుంటే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారని గౌరి పేర్కొంది. అద్వానీ చెప్పినట్టుగా విని మారు మాట్లాడకుండా విడాకులకు అంగీకరిస్తే మంచిదని లేదంటే విపత్కర పరిణామాలకు సిద్ధంగా వుండాలని పూరి తనను హెచ్చరించినట్టుగా ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్నారు.
జయంత్
అద్వానీతో
గౌరి
వివాహం
1991
డిసెంబర్లో
జరిగింది.
ఆమె
లండన్లోని
ఒక
సొలిసిటర్
కార్యాలయంలో
పనిచేస్తున్నారు.
లండన్లో
తనకు
డిప్యూటీ
హైకమిషనర్
హర్దీప్పూరి
అనేక
సార్లు
ఫోన్
చేశారని
ఢిల్లీనుంచి
అత్యవసరంగా
అందజేయాల్సిన
మెసెజ్
వున్నదని
చెప్పేవారని
గౌరి
పిటీషన్లో
పేర్కొంది.
ఆయన
మాటలు
నమ్మి
తాను
నవంబర్
7న
పూరి
కార్యాలయానికి
వెళ్లి
కలుసుకున్నట్టుగా
ఆమె
తెలిపారు.
జయంత్తో
తన
వివాహం
విషయాన్ని
గురించి
వ్యక్తిగత
వ్యవహారాల
గురించి
పూరి
ప్రస్తావించారని
పైగా
ఈ
విషయాలు
మాట్లాడేందుకు
హోం
మంత్రి
అద్వానీ
తనకు
పూర్తి
అధికారాలు
ఇచ్చారని
పూరి
చెప్పినట్టుగా
గౌరి
వెల్లడించింది.
పరాయి
వ్యక్తులతో
వ్యక్తిగత
విషయాలు
మాట్లాడేందుకు
తాను
తిరస్కరించి
తిరిగి
వచ్చేశానని
అప్పటినుంచి
తనకు
వేధింపులు
పెరిగాయని
ఆమె
చెప్పారు.
ఈ
విషయంపై
ఫిర్యాదు
చేస్తూ
ఢిల్లీ
పోలీసులకు
రిజిస్టర్డ్
లేఖ
రాసినట్టుగా
ఆమె
వెల్లడించారు.
హోంమంత్రిత్వ
శాఖ
ఆదేశాల
వల్ల
ఫిర్యాదు
చేసుకోలేదని
ఆమె
ఆరోపించారు.
తాను
స్వయంగా
ఫిర్యాదు
చేయడానికి
తిలక్మార్గ్
పోలీసు
స్టేషన్కు
వెళ్లగా
అక్కడ
కూడా
ఫిర్యాదు
స్వీకరించడానికి
తిరస్కరించారని
ఆమె
పేర్కొన్నారు.
ఫిర్యాదులో
నిజానిజాల
మాట
ఎలా
వున్న
అత్యంత
మర్యాదస్తుడైన
కుటుంబికునిగా
పేరున్న
అద్వానీని
ఆయన
కోడలు
రచ్చకీడ్చడం
మాత్రం
ఆయన
ప్రత్యర్ధులకు
--కి
కొబ్బరికాయ
దొరికినంత
ఆనందంగా
వుంది.
గత
సంచికలో