కమ్మనాడుపై కత్తికట్టినవేదాలు!
పైగా, కాంగ్రెస్లోని బిసి లాబీ మొత్తంగా సత్యనారాయణరావుకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిసిపోతూనే ఉన్నది. ఈ స్థితిలో ఆయన చేతలుడిగి వైరాగ్య స్థితికి చేరుకున్నారు. ఉన్నంత కాలం ఉంటాను, ఊడినప్పుడు పోతాననే దశకు ఆయన చేరుకున్నారు. ఈ కారణంగానే కావచ్చు ఆయన గత పది నెలలుగా కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీని కలుసుకోలేదు. ఆ మధ్యకాలంలో ఢిల్లీ పర్యటనకు బయలుదేరినప్పటికీ వాతావరణం అనుకూలించక అక్కడ అడుగు పెట్టలేకపోయారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లారు. హస్తిన నుంచి ఆయన ఏ స్థితిలో తిరిగి వస్తారో తెలియదు.
ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్కు అత్యంత కీలకమైనవి. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో వుంది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచకుండా తిరిగి అధికారం సంపాదించుకోవడం ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు కత్తి మీద సాము వంటిదే. ఈ ఎన్నికల తర్వాత సోనియా ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల వైపు దృష్టి పెడతారా? ఇప్పుడే అందుకు సిద్ధపడతారా అనేది ఇతమిద్దంగా తేలడం లేదు.