వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలిదశలో టిఆర్‌ఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాజ్‌పేయి నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అవుట్‌లుక్‌ సర్వే తేల్చింది. ఎన్‌డిఎకు 280 నుంచి 290 సీట్ల వస్తాయని సర్వే వెల్లడించింది.

కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలకు 159, 169 సీట్ల మధ్య వస్తాయని అవుట్‌లుక్‌ కోసం మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ (ఎండిఆర్‌ఎ) నిర్వహించిన సర్వేలో తేలింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి 1999 ఎన్నికల్లో కన్నా కాస్తా ఎక్కువ సీట్లు వస్తాయట. ప్రస్తుతం 182 లోక్‌సభ్యులున్న బిజెపికి ఈ ఎన్నికల్లో 195 సీట్లు గెల్చుకుంటుందని సర్వే తేల్చింది. కాంగ్రెస్‌ పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా దిగజారిపోతుందని సర్వే అంటోంది. కాంగ్రెస్‌కు 103 సీట్లు మాత్రమే వస్తాయట. ఇప్పుడు కాంగ్రెస్‌కు 114 మంది సిట్టింగ్‌ సభ్యులున్నారు.

కాంగ్రెస్‌ మిత్రపక్షాల పరిస్థితి మాత్రం కాస్తా మెరుగ్గా ఉంటుందట. వీరి సంఖ్య లోక్‌సభలో 40 నుంచి 61కి పెరుగుతుందని అవుట్‌లుక్‌ అంటోంది. ఎన్‌డిఎ మిత్రపక్షాల మాత్రం 8 సీట్లు కోల్పోతారట. ఇతర పార్టీలకు 89 నుంచి 99 సీట్ల వరకు వస్తాయని సర్వే వెల్లడించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X