మార్పులతో దశ తిరుగుతుందా?
ప్రపంచవ్యాప్తంగా ఐటి కంపెనీల భవిష్యత్తు ఆందోళనకరంగా మారి, స్టాక్ మార్కెట్లో న్యూ ఎకానమి షేర్ల పేరు చెబితేనే ఇన్వెస్టర్లు భయపడుతున్న పరిస్థితుల్లో సత్య కంప్యూటర్స్ అమెరికన్ డిపాజిటరీ షేర్స్ ఇష్యూకు అనూహ్యమైన ప్రతిస్పందన లభించింది. మంగళవారం నాడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆఫర్ ధరకంటే సుమారు 18 శాతం హెచ్చుస్థాయిలో సత్యం ఎడిఎస్లు ట్రేడయ్యాయి. ఇన్వెస్టర్ల ప్రతిస్పందన చూసి ఇష్యూ సైజును కూడా హెచ్చించారు. తొలుత 11కోట్ల యాభై లక్షల డాలర్లకు ఎడిఎస్లను ఆఫర్ చేయాలని నిర్ణయించగా చివరకు 14 కోట్ల డాలర్ల ఎడిఎస్లను విక్రయించారు. ఇష్యూ ఏడు రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. ప్రతి ఎడిఎస్ ఇండియన్ మార్కెట్లలో ట్రేడయ్యే రెండు సత్యం కంప్యూటర్ షేర్లకు సమానం. ఎడిఎస్ ఆఫర్ ధర 9.71 డాలర్లు కాగా లిస్టింగ్తోనే 18 శాతం ప్రీమియంతో 11.22 డాలర్లవద్ద ట్రేడయింది.