ఆమె గొంతులో పూల దొంతరలు!
ఈ మేరకు ప్రధానినుంచి తమకు హామీ లభించిందని తృణమూల్ నేత మమతాబెనర్జీ చెప్పుకుంటున్నారు. తృణమూల్తో పాటు ఈసారి విస్తరణలో తెలుగుదేశం కూడా వుంటుందని ప్రధాని తనతో అన్నారని ఆమెను ఉటంకిస్తూ ఢిల్లీలో వార్తలు ప్రచారంలో వున్నాయి. ఇది నిజమైతే బాగుండునని కోరుకుంటున్న దేశం ఎంపీలు అగ్రనేతను ఒప్పంచడానికి గ్రూప్లు కడుతున్నట్టుగా తెలిసింది. మరోవైపు నెల్లూరు, రంగారెడ్డి, కర్నూలు, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు మంత్రులకు వ్యతిరేకంగా జట్టుకట్టి బహిరంగంగానే అసమ్మతి జెండా ఎగురవేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అసమ్మతి ఎమ్మెల్యేలు సీనియర్ మంత్రి దేవేందర్గౌడ్కు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నారు. కులపరంగా తమ లెక్కలు తప్పకుండా దేవేందర్గౌడ్ను దెబ్బతీయడానికి ఎస్సి ఎమ్మల్యే చంద్రశేఖర్ను ముందుంచి అసమ్మతి నేతలు సాగిస్తున్న పోరాటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.