వివియస్ లక్ష్మణ్ చేసిన పాపమేమి?
ఇస్లామాబాద్:భారత్, పాకిస్థాన్ ప్రజల మధ్యస్నేహవాతావరణాన్నిపెంపొందించేందుకు సినిమాలు తీస్తాననిభారత సంతతికి చెందినఫిల్మ్మేకర్ మీరా నాయర్ చెప్పారు.ఆమె ప్రస్తుతం ఫాకిస్థాన్లోపర్యటిస్తున్నారు.భారతచిత్రాలు పాకిస్థాన్ వ్యతిరేకసెంటిమెంట్ను రెచ్చగొట్టే విధంగాఉంటున్నాయని అన్నప్పుడు ఉభయ దేశాలను,ఉభయ దేశాల ప్రజలను సన్నిహితం చేసేవిధంగా, దురవగాహనను తొలగించేవిధంగా ఒక సినిమా తీయడానికి తానుప్రయత్నాలు చేస్తున్నానని ఆమె చెప్పారు.ఇందూస్ ప్లస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోఆమె ఈ విషయం చెప్పారు. భారతఉపఖండంలో ఫిల్మ్ మేకర్స్ స్వేచ్ఛగాసంచరించడానికి భారత, పాకిస్థాన్దేశాలు అనుమతించాలని ఆమె అన్నారు.భారత,పాక్ల మధ్య సంబంధాలు మెరుగుకాగలవని, ఉభయ దేశాల మధ్యపర్యటించేవారి సమస్యలు పరిష్కారంకాగలవని ఆమె ఆశించారు. పాకిస్థాన్కురావడంలో తనకు ఏ విధమైనఇబ్బందులు లేవని, ఇబ్బంది ఉంటుందని కూడాతాను అనుకోవడం లేదని ఆమె అన్నారు.స్థానిక పత్రిక డైలీ టైమ్స్ ఆహ్వానంమేరకు ఆమె ఇక్కడికి వచ్చారు.తనసినిమాలో ప్రముఖ పాకిస్థాన్ కవి ఫైజ్అహ్మద్ ఫైజ్ పాటలు వాడుకుంటానని, వాటినిపాకిస్తానీ జానపద గాయకుడు అబిదాపర్వీన్తో పాడిస్తానని ఆమె చెప్పారు. అదిమన ఉమ్మడి సంస్కృతి అని, పాకిస్థాన్ఫిల్మ్మేకర్స్ ముందుకు రావాలని, ఇదిప్రపంచానికి తెలియదని, తాను ఇక్కడచూస్తున్నది చాలా శక్తివంతమైందనిఆమె అన్నారు.స్క్రీన్రైటింగ్లో, దర్శకత్వంలో యువఫిల్మ్మేకర్లకు శిక్షణ ఇవ్వడానికితాను ఆగస్టు పదకొండవ తేదీనతూర్పు ఆప్రికాలో ఒక సంస్థనుస్థాపిస్తున్నట్లు ఆమె తెలిపారు. తూర్పుఆప్రికా నుంచి ఎనమండుగురిని,పాకిస్థాన్, శ్రీలంక, ఇండియాల నుంచినలుగురిని ఎంపిక చేసుకుంటానని ఆమెచెప్పారు. దక్షిణాసియా ప్రజలు స్క్రీన్రైటింగ్, డైరెక్టింగ్ క్రాఫ్ట్నునేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని మీరానాయర్ అభిప్రాయపడ్డారు. మనకథలను మనం చెప్పకపోతే ఎవరూచెప్పరని ఆమె అన్నారు.