డాక్టర్ రెడ్డికి మరో అరుదైన గౌరవం
ఇది నిజంగా బాసర క్షేత్ర అభివృద్ధికి పడుతున్న ఆరాటమేనా లేక దీని వెనక మరేవైనా ప్రయోజనాలు దాగివున్నాయా? ఆంధ్రదేశంలో అభివృద్ధి పేరుతో సాగుతున్న తంతు గమనిస్తున్న వారెవరికైనా ఇలాంటి అనుమానాలే వస్తాయి. నిష్టురమైనప్పటికీ సత్యాలను మాట్లాడుకోక తప్పదు. బాసరలో ఐఐటి లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను చాలా రోజులుగా చేస్తున్న వ్యక్తి ప్రముఖ విద్యావేత్త సి రామయ్య. ఆంధ్రా విద్యార్ధులు ఐఐటిని అందని ద్రాక్షగా భావించి నిట్టూర్పులు విడుస్తున్న తరుణంలో రంగంలోకి దిగిన రామయ్య ఏటా అనేక మంది విద్యార్ధులను తనకోచింగ్తో ఐఐటిలకు పంపుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం విదితమే. విద్యావేత్తగా, మేధావిగా, ఆభ్యుదయవాదిగా రామయ్య మాస్టారు గౌరవనీయులే. బాసర క్షేత్రనిలయ జగన్మాత సరస్వతి మన ఆరాధ్యదైవమే. ఈ రెండు అంశాలకు అతీతమై విషయాలే ఇప్పుడు మనం మాట్లాడుకోవల్సివుంది.