పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
తాజా పరిణామాన్ని జనక్రాజ్, భరత్చంద్ర మౌనంగా స్వీకరించడానికి అంగీకరించినప్పటికీ ఆంజనేయరెడ్డి మాత్రం సుముఖంగా లేరని తెలుస్తున్నది. ఈ విషయంలో రాములు నియామకం ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన తన అసమ్మతి ముఖ్యమంత్రికి తెలిసేలా చేశారు. సర్వీసునుంచి రాజీనామా చేయడానికి ఆంజనేయరెడ్డి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కలవరపడ్డారు. రాష్ట్రంలోని సీనియర్ అధికారుల్లో ఒకరైన ఆంజనేయరెడ్డికి మంచిపేరే వుంది. అవినీతి ఆరోపణలు గానీ, ఒక వర్గానికే విధేయుడుగా వుంటారనే మచ్చగానీ ఆయనకు లేవు. మాజీ డిజిపి దొర కంటే ముందుగా నక్సలైట్ల విషయంలో దూకుడుగా వ్యవహరించిన పేరు ఆయనకు వుంది. విధి నిర్వహణలో టఫ్గా వుంటారనే పేరు తెచ్చుకున్నారు. అందుకనే కాంగ్రెస్ హయాంలో ఆయనకు కొంత ఎక్కువ ప్రాధాన్యత వుండేది. అదే ఆయన్ను తెలుగుదేశం పాలనలో సైడ్లైన్లోకి నెట్టిందని పోలీసు వర్గాల అభిప్రాయం. రాములు ఎంపికకు ప్రభుత్వం కారణాలు ప్రభుత్వానికి వున్నాయి. ఈ విషయం ఆంజనేయరెడ్డికి కూడా బాగా తెలుసు.