చెట్టు కంటేవిలువైనది శిల
ఎస్టిపి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఐటి షోలో 333 కంపెనీలు పాల్గొన్నాయి. అందులో 70 కంపెనీలు దేశాలకు చెందిన కావడం గమనార్హం. ఈ సారి జర్మనీ, జపాన్ నుంచి పాల్గొన్న కంపెనీలు ఉత్సాహంగా వుండటం నిర్వాహకులను ఉత్తేజపర్చింది. ప్రదర్శనను సందర్శించిన వారిలో 45 వేల మంది ధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కాగా మరో మూడు వందల మంది దేశీ ప్రతినిధులు వున్నారని సుమారు రెండు లక్షల మంది ప్రజలు కూడా ప్రదర్శనకు వచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే వ్యాపార ఒప్పందాలు ఈ సారి తక్కువే అని చెప్పవచ్చు. తొలిసారిగా ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ అమ్మకం కొనుగోలు దార్ల సదస్సును కూడా నిర్వహించారు. ఈ సదస్సుకు కూడా ప్రతిస్పందన అంతంతమాత్రంగానే వుంది. అయినప్పటికీ ఈ షో వల్ల నిరాశలో మునిగిన దేశీయ ఐటి రంగానికి కొత్త ఉత్సాహం లభించింది. మళ్లీ శక్తులు కూడదీసుకోవడానికి ఇదో టానిక్లా పనిచేసింది.