దియా మిర్జా ఫోటో గ్యాలరీ
విదేశీక్రికెట్ జట్టుకు తాను ఎప్పుడూ కోచ్గావ్యవహరించబోనని భారత క్రికెట్జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్అన్నారు. ఒక వేళ కోచ్గావ్యవహరించాలనుకుంటే దేశ జట్టుకుమాత్రమే వ్యవహరిస్తానని ఆయనచెప్పారు. హీరో ఇండియన్ స్పోర్ట్స్అకాడమీ సభ్యురాలిగా అశ్వినీ నాచప్పనుచేర్చుకున్నట్లు ప్రకటించడానికిఏర్పాటయిన మీడియా ప్రతినిధులసమావేశంలో ఆయన మాట్లాడారు. తానపాసినేట్ పర్సన్ను అని, తాను ఆవిధంగానే పీల్ అవుతానని, అయితేఇతర దేశాలకు సేవలందిస్తున్నవారుపాసినేట్ వ్యక్తులు కారనేది తనఅభిప్రాయం కాదని, ఒక్కొక్కరు ఒక్కో రకంగాఉంటారని ఆయన అన్నారు.బ్యాటింగ్లోసౌరబ్ గంగూలీ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూభారత కెప్టెన్కు మరి కొంతసమయం ఇవ్వాలని ఆయన అన్నారు.గంగూలీకి సమయం ఇవ్వాలని, గంగూలీపనిపై సందేహాలు వ్యక్తం చేయడంమొదలు పెట్టడం సరి కాదని, గంగూలీకిమూడు లేదా ఆరు నెలల సమయంఇవ్వాలని, ఈ సమయంలో గంగూలీకిమద్దతు ఇవ్వడానికి తానుఇష్టపడుతానని ఆయన అన్నారు.భారతజట్టుకు బౌలింగ్ కోచ్ను నియమించేవిషయమై ప్రస్తావించగా నియమిస్తేతప్పేమీ కాదని, బిసిసిఐకి నిధుల కొరతలేదని అన్నారు. అయితే ఎక్కువ మందివంటవాళ్ల వల్ల ఆహారపదార్థాలుచెడిపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.ఇతర క్రీడలకు చెందినవారికి కూడామీడియా, ప్రజానీకం మద్దతు ఇవ్వాలనిఆయన అభిప్రాయపడ్డారు.