పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
ఆయన హయాంలోనే ఎన్కౌంటర్ల పేర పోలీసులు చెలరేగిపోయారు. నకిలీ నక్సలైట్లు, మాజీ నక్సలైట్లు మాఫియా ముఠాలుగా ఏర్పడి అరాచకం సృష్టించడం సర్వసాధారణమైంది. స్వయంగా ఆయనపై కూడా కృషి బాంకు ఉదంతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ రాజకీయనాయకత్వం ఆయనపై వుంచిన అచంచల విశ్వాసం వల్ల ఆయనకు ఎటువంటి గండాలు ఎదురుకాలేదు. ఆయనకన్నా ముందు డిజిపిలుగా వున్నవారు దొర ఎదుర్కున్న సవాళ్ల కంటే తక్కువ సవాళ్లకు కూడా స్థానచలనం పొందిన సందర్భాలు వున్నాయి.
గత కొద్ది సంవత్సరాలుగా పోలీసు శాఖ ప్రజల్లో ఎంతలా భ్రష్టుపట్టిపోయిందో గమనిస్తే రాములు ముందు పెను సవాళ్లు పొంచుకుని వున్న విషయం అర్ధం అవుతుంది. రాములు డిజిపిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో తన సీనియార్టీకి తగిన గౌరవం లభించలేదని కినుకతో మరో సీనియర్ ఐపిఎస్ అధికారి ఆంజనేయరెడ్డి సర్వీసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇదేమంత మంచి శకునంకాదు. చాలా మంది సీనియర్ అధికారులు సిన్సియర్ అధికారులు లూప్లైన్లో వున్నట్టుగా విమర్శలు వున్నాయి. పోలీసు శాఖను సమర్ధంగా తీర్చిదిద్దడానికి ఈఅధికారులను మెయిన్ స్ట్రీమ్లోకి తేవడానికి కొత్త డిజిపి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వేచిచూడాల్సివుంది.